టాలీవుడ్ లో ఐటి కలకలం

టాలీవుడ్ లో మొత్తానికి ఆదాయపన్ను హడవుడి మొదలైనట్లుంది. చాలా మంది నిర్మాతలు, ఇద్దరో ముగ్గురో నటులు ఆదాయపన్ను కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది.  నిర్మాత సాయి కొర్రపాటి కార్యాలయాల మీద ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసిన తరువాత ఎక్కడి వాళ్లు అక్కడ గప్ చుప్ అయిపోయారు. 

అర్జెంట్ గా నల్ల డబ్బు దాచేసే పనిలోనూ, తెల్ల డబ్బుకు పక్కా లెక్కలు తయారుచేసే పనిలోనూ పడ్డారు. అయితే ఆదాయపన్ను శాఖ కొత్తగా దాడులు చేయకున్నా, కొన్ని నిర్మాణ సంస్థలకు, కొందరు నిర్మాతలకు, కొందరు నటులకు వివిధ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన లావాదేవీలకు సంబంధించో, గతంలో దాఖలు చేసిన రిటర్న్ లకు సంబంధించో ఈ నోటీసుల జారీ జరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో ఇప్పుడు నోటీసులు అందుకున్నవారు సమాధానాలు ఇచ్చే పనిలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి సినిమా జనాలు అందరికీ ప్రస్తుతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఐటీ ఫీవర్ పట్టుకున్నట్లుంది. అవును..ఇంతకీ ఇండస్ట్రీకి చెందిన ఒకరిద్దరయినా మోడీ ప్రవేశపెట్టిన బ్లాక్ మనీ వెల్లడి స్కీమ్ కింద, ఏమైనా వెల్లడిస్తారా? అనుమానమే?

Show comments