పీర్స్ మోర్గన్ .. మళ్లీ మొరిగాడు!

అసలు ఆ పిచ్చోడి ట్వీట్ ను తొలుత హైలెట్ చేయడమే ఇండియన్ మీడియా పొరపాటు కాబోలు. ఆ తెల్ల కుక్క మొరుగుతున్న తీరును చూస్తుంటే ఇదే అభిప్రాయం కలుగుతోంది. రెండు పతకాలకే సంబరాలు చేసుకొంటోంది అంటూ ఒలింపిక్స్ లో భారత ప్రదర్శన విషయంలో అనుచితమైన వ్యాఖ్యలు చేసిన పీర్స్ మోర్గాన్ మళ్లీ భారతీయుల మీద అలాంటి వ్యాఖ్యానాలే చేశాడు.

ఒలింపిక్స్ లో ఇండియా ప్రదర్శన మీద ఇతడు చేసిన వ్యాఖ్యానాలపై క్రికెటర్ సెహ్వాగ్ లాంటి వాళ్లు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్ ఎందుకు ప్రపంచకప్ నెగ్గలేకపోయిందని అంటూ పీర్స్ కు గట్టి పంచే ఇచ్చాడు వీరూ. అయితే పీర్స్ మాత్రం మళ్లీ రెచ్చిపోయాడు.

భారతీయ ట్విటర్ జనాలు తన విషయంలో ఇప్పుడు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. నేను చేసిన గాయాలకు మందుపూసుకొంటున్నారా.. అంటూ ఈ బఫూన్ మరో ట్వీట్ పెట్టాడు. ఒక్క రోజులో తన ఫాలోయర్ల సంఖ్య 12 వేల వరకూ పెరిగిందని.. ‘థ్యాంక్యూ ఇండియన్ ఫ్రెండ్స్’ అంటూ మోర్గన్ ఇంకో ట్వీట్ పెట్టాడు.

మరి వీడిది తెల్ల గజ్జి ఉన్నట్టుంది. పట్టించుకున్నాంతా పెరుగుతుంది. ఇలాంటి వాడికి సెలబ్రిటీ ట్విటర్ అకౌంట్ల నుంచి సమాధానాలు రాకపోతేనే మేలేమో. 

Show comments