ఈ రెడ్డి కాదు ఆ రెడ్డి

ఉదయాన్నే న్యూస్ పేపర్లలో ఫొటో, వార్త. యాక్టర్ శ్రీనివాసరెడ్డికి టీటీడీ భక్తి చానెల్ డైరక్టర్ పదవి అంటూ. దాంతో ఆయనకు ఫోన్ లే ఫోన్లు.. అభినందనలు. కానీ ఆయన సున్నితంగా జవాబు చెప్పడం. ఆ రెడ్డి నేను కాదు బాబూ అంటూ. అసలు విషయం ఏమిటంటే, ఆ శ్రీనివాసరెడ్డి వేరు. ఢమరుకం అనే సినిమా నాగార్జునతో తీసిన డైరక్టర్ శ్రీనివాసరెడ్డి. ఈయన ప్రస్తుతం 'రాగల 24గంటల్లో' అనే సినిమా తీసి, విడుదలకు రెడీ చేసారు. ఆయనను ఈ డైరక్టర్ పదవి వరించింది.

శ్రీనివాసరెడ్డికి డైరక్ట్ గా పార్టీతో సంబంధాలు లేవు కానీ, ఆయన ముఖ్యమంత్రి జగన్ కు సన్నిహితులైన వారితో గట్టి సంబంధాలు వున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ, ఇటీవల ఎన్నికల సందర్భంగా పార్టీకి రకరకాల ఆయన క్రియేటివ్ వర్క్ చేసి సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది. పార్టీకి ప్రకటనల రూపకల్పనలో కూడా ఆయన పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ విధంగానే ఆయనను ఈ పదవి వరించినట్లు తెలుస్తోంది.

మొత్తంమీద పార్టీకి సాయం చేసిన వారిని, పార్టీని అంటి పెట్టుకువున్నవారిని ఎవ్వరినీ జగన్ మరిచిపోవడం లేదు. ఒక్కొక్కరికీ ఏదో ఒకటి చేసుకుంటూ వస్తున్నారు.

తెరమీద నీతులు.. తెర వెనుక బ్లాక్ మెయిలింగ్

Show comments