భోగి మంట‌ల్లో క‌రోనా భ‌స్మంః డైలాగ్ కింగ్‌

ప్ర‌ముఖ సినీ న‌టుడు, డైలాగ్ కింగ్ మోహ‌న్‌బాబు త‌న ఇష్ట‌దైవమైన శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారిని గురువారం ద‌ర్శించుకున్నారు. కుమార్తె మంచు ల‌క్ష్మితో క‌లిసి ఆయ‌న వీఐపీ విరామ స‌మ‌యంలో శ్రీ‌వారి ఆశీస్సులు అందుకున్నారు. ద‌ర్శ‌నానంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.
 
తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతోంద‌ని కితాబునిచ్చారు. అవినీతికి తావు లేకుండా అందరికీ ఒకే విధంగా క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. ఈ సంద‌ర్భంగా క‌రోనా మ‌హ‌మ్మారిని ఆయ‌న గుర్తు చేసుకున్నారు. 

భోగి మంటల్లో కరోనా మ‌హ‌మ్మారి భస్మం అయిపోయిందని మోహ‌న్‌బాబు చెప్పుకొచ్చారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం త‌న అదృష్టంగా భావిస్తున్న‌ట్టు తెలిపారు. 

మంచు ల‌క్ష్మి కేవ‌లం న‌టిగానే కాకుండా సినీ నిర్మాత‌గా, వ్యాఖ్యాత‌గా కూడా రాణిస్తున్న విష‌యం తెలిసిందే. వైవిధ్య‌భ‌రిత‌మైన న‌టిగా మంచు ల‌క్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ముఖ్యంగా బుల్లితెర‌పై, అలాగే సోష‌ల్ మీడియా వేదిక‌ల‌పై ప్ర‌ముఖుల‌ను ఇంట‌ర్వ్యూ చేస్తూ వాళ్ల నుంచి కీల‌క విష‌యాల్లో రాబ‌ట్ట‌డంలో ల‌క్ష్మి దిట్ట అనే పేరు తెచ్చుకున్నారు. 

ఈ సంక్రాంతి అల్లుడు నేనే

మంచి కిక్‌ ఇచ్చారు

Show comments