మరో క్లారిటీ ఇచ్చిన నాగార్జున

అఖిల్ కోసం శ్రీదేవి కూతుర్ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారనే వార్తను స్వయంగా ఖండించాడు నాగార్జున. ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఏదీ తమకు రాలేదని స్పష్టంచేశాడు. తాజాగా మరో రూమర్ ను ఖండించాడు.

బోయపాటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ సినిమా సెట్ చేసేందుకు నాగార్జున  ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు కోసం బోయపాటికి నాగ్ ఏకంగా 12 కోట్ల రూపాయల ఆఫర్ కూడా ఇచ్చారంటూ కథనాలు వచ్చాయి. వీటిని నాగార్జున ఖండించాడు. ఈ వార్తల్లో నిజం లేదని ప్రకటించాడు.

నాగచైతన్య హీరోగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా నిర్మించాడు నాగార్జున. ప్రస్తుతం అఖిల్ హీరోగా మరో సినిమా నిర్మిస్తున్నాడు. మరోవైపు తను హీరోగా రాజుగారి గది-2 సినిమాను పూర్తిచేస్తున్నాడు. అఖిల్ తో పాటు తన సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరోసారి హీరోగానే కొనసాగాలని నిర్ణయించాడు నాగ్. 

నాగచైతన్య, అఖిల్ తో ఇప్పట్లో మళ్లీ సినిమాలు నిర్మించనని ప్రకటించాడు నాగ్. బయట నిర్మాతలతో వాళ్లు కొన్ని సినిమాలు చేసిన తర్వాత.. మంచి కథలు దొరికితే అప్పుడు మళ్లీ అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై వాళ్లతో సినిమాలు నిర్మిస్తానంటున్నాడు.

Show comments