సీక్వెల్ ప్రకటించిన పూరి.. నెక్ట్స్ మూవీ ఇదేనా?

ఇస్మార్ట్ శంకర్ సినిమా తెరకెక్కుతున్న టైమ్ లోనే దానికి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ కూడా తీస్తానంటూ ప్రకటించాడు పూరి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత సమీకరణాలు మారొచ్చని అంతా లైట్ తీసుకున్నారు. కానీ పూరి మరోసారి డబుల్ ఇస్మార్ట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. తనకు కొన్ని ఐడియాస్ ఉన్నాయని, ఆ ఆలోచనలన్నీ క్రోడీకరించి డబుల్ ఇస్మార్ట్ కు ఓ రూపు తీసుకొస్తానని చెబుతున్నాడు.

ప్రస్తుతం యూనిట్ అంతా సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. ఓవైపు మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూనే, మరోవైపు ప్రతిరోజు పండగ చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఓ మీడియాతో మాట్లాడిన పూరి జగన్నాధ్, డబుల్ ఇస్మార్ట్ ను తెరపైకి తీసుకొస్తానని ప్రకటించాడు. కానీ నెక్ట్స్ మూవీ ఇదేనా అనే అంశంపై మాత్రం ఈ డైరక్టర్ క్లారిటీ ఇవ్వలేదు.

ప్రస్తుతానికైతే 2 నెలలు గ్యాప్ తీసుకుంటానని ప్రకటించాడు పూరి. సినిమాల ఆలోచన లేకుండా 2 నెలలు విశ్రాంతి తీసుకుంటానని, తన ఫిజిక్, ఆరోగ్యంపై దృష్టిపెడతానని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తానంటున్నాడు. సో.. ఈ 2 నెలల్లో పూరి ఆలోచనలు ఎలాగైనా మారొచ్చు. సీక్వెల్ ను పక్కనపెట్టి మరో స్ట్రయిట్ మూవీ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఇస్మార్ట్ శంకర్ ఎఫెక్ట్ తో పూరికి ఈసారి ఆఫర్లు బాగానే వచ్చే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఓ హిట్ డైరక్టర్ కోసం చూస్తున్న బాలయ్య, ఈసారి పూరికి ఇంకో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అటు నితిన్, రవితేజ, గోపీచంద్ లాంటి హీరోలు కూడా సక్సెస్ కోసం పూరి వైపు చూస్తున్నారు. ఇప్పటికే సంప్రదింపులు షురూ చేశారు. కాబట్టి ఇప్పటికిప్పుడు పూరి, ఈ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకురాకపోవచ్చు.

జగన్‌ మొహంలో చిరునవ్వు మార్పు కనబడుతోంది

Show comments