అసలు సంగతి రేపు తేలిపోతుంది

బాలీవుడ్ లో రేపు రాబ్తా అనే సినిమా విడుదలకానుంది. ఇందులో స్టార్ హీరోహీరోయిన్లు ఎవరూ లేరు. కానీ టాలీవుడ్ దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. ఎందుకంటే మగధీర సినిమాను కాపీ కొట్టి రాబ్తా మూవీ తీశారనే ఆరోపణలున్నాయి. అందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.
 
మగధీర వర్సెస్ రాబ్తా.. ఈ మధ్యంతా ఈ రెండు సినిమాల మధ్య చాలా లొల్లి నడిచింది. వ్యవహారం కోర్టు కేసు వరకు వెళ్లింది. మగధీర సినిమాను యాజ్ ఇటీజ్ లేపేశారని గీతా ఆర్ట్స్ బ్యానర్ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాబ్తా నిర్మాతలకు నోటీసులు కూడా పంపించింది. దీనికి రాబ్తా యూనిట్ ఘాటుగానే స్పందించింది. అన్ని సినిమాలూ మగధీరలా ఉండవని కాస్త కామెడీగానే సెటైర్లు వేసింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండంటూ జవాబిచ్చింది.

ఇలా 2 నిర్మాణ సంస్థల మధ్య లీగల్ వార్ నడుస్తున్న నేపథ్యంలో రాబ్తా మూవీ థియేటర్లలోకి వస్తోంది. సుశాంత్ సింగ్, కృతి సనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మగధీరను పోలి ఉన్నాయి. మగధీరలా ఇది కూడా పీరియాడిక్ డ్రామా. మగధీరలో రామ్ చరణ్ ఎంట్రీని పోలినట్టే ఇందులో సుశాంత్ ఇంట్రడక్షన్ ఉంది. మగధీరలో ఉన్న ఘోరా లాంటి పాత్రను ఇందులో రాజ్ కుమార్ రావు పోషించాడు. 

Show comments