కుమారి కాంబోలో మరో సినిమా

కుమారి 21 ఎఫ్. డైరక్టర్ సుకుమార్ నిర్మాణంలో పెద్ద హిట్ అయిన చిన్న సినిమా. పైగా రత్నవేలు, దేవీశ్రీప్రసాద్ వంటి పెద్ద టెక్నీషియన్లు పనిచేసిన చిన్న సినిమా. మళ్లీ ఇదే కాంబోలో ఇంకో సినిమా ప్లాన్ చేస్తున్నారట.

కుమారి 21 ఎఫ్ సినిమాలో హీరోగా నటించిన రాజ్ తరుణ్ హీరోగా, సుకుమార్ నిర్మాతగా, ప్రతాప్ డైరక్టర్ గా, దేవీ మ్యూజిక్ డైరక్టర్ గా పనిచేస్తారు. కానీ రత్నవేలు మాత్రం వేరే సినిమాలతో బిజీగా వుండడం వల్ల ఈ ప్రాజెక్టులో వర్క్ చేయకపోవచ్చట.

ప్రస్తుతం రాజ్ తరుణ్ అన్నపూర్ణ సంస్థలో కొత్త దర్శకురాలితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నెలలోనే రాజూగాడు షూటింగ్ షురూ అవుతుంది. అది పూర్తి కాగానే దిల్ రాజు నిర్మాణంలో ఒకటి, ఈ కుమారి కాంబోతో మరొకటి ఒకేసారి ప్రారంభమవుతాయి. కుమారి 21 ఎఫ్ కాంబో, అదీ వితవుట్ హెబ్బా పటేల్ అంటే కాస్త ఆసక్తికరంగానే వుంటుంది.

Show comments