స్వాతి బలరాం కుమార్తె మృతి

ప్రముఖ సంపాదకుడు, పబ్లిషర్ వేమూరి బలరామ్ కుమార్తె మణిచందన (46) మరణించారు.  ఏడాది కాలంగా అస్వస్థతతో వున్న ఆమెకు కరోనా సోకి మరణించారని తెలుస్తోంది. అయితే అస్వస్థత కారణంగా గుండెపోటు వచ్చి మరణించారని కూడా వినిపిస్తోంది. 

ఆంధ్ర ఇన్ కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ అనిల్ కుమార్ భార్య ఆమె. ఇద్దరు కుమార్తెలు వున్నారు. గత ఏడాది కాలంగా ఆమె కాస్త అస్వస్తతగా వున్నారు.

ఇటీవల కరోనా సోకి, తగ్గింది. బాగానే వున్నారని సమాచారం. కానీ వున్నట్లుండి నిన్న రాత్రి నుంచి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి. దాంతో ఈ ఉదయం కన్నుమూసారు. వేమూరి బలరామ్ కు ఆమె ఒక్కరే కుమార్తే. ఆమెకు ఇద్దరు కుమార్తెలు వున్నారు.  

మణిచందన్ స్వాతి మెనేజింగ్ ఎడిటర్ గా వున్నారు.

Show comments