లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్ సెల్ఫ్ క్వారంటైన్

జస్ట్ 10 రోజుల కిందటే లండన్ నుంచి వచ్చింది హీరోయిన్ శృతిహాసన్. ఎయిర్ పోర్ట్ లో ఆమెకు స్క్రీనింగ్ కూడా పూర్తయింది. చేతికి సెల్ఫ్ క్వారంటైన్ (స్వీయ నిర్బంధం) ముద్ర కూడా వేశారు. ప్రస్తుతం ఆమె ఇంటి నుంచి బయటకు రావడం లేదు. ఇలా ఒంటరిగా ఉండడం తనకు కొత్త కాదంటోంది శృతిహాసన్.

"ఇలా ఏకాంతంగా గడపడం నాకు కొత్తేం కాదు. ఈ క్వారంటైన్ టైమ్ లో నేను కుకింగ్, బేకింగ్ చేయడంతో పాటు ఆర్గానిక్ సబ్బులు కూడా తయారుచేస్తున్నాను. ఇంట్లో ఇలా మరో ఆప్షన్ లేకుండా ఉండడం కాస్త ఇబ్బంది అనిపిస్తున్నప్పటికీ.. బయట ఏం జరుగుతుందో అనే భయంతో పోలిస్తే ఇది చాలా చిన్నది."

శృతిహాసన్ తో పాటు కమల్ హాసన్, అక్షర హాసన్ కూడా విదేశాలకు వెళ్లి వచ్చారు. దీంతో వాళ్లు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నారు. ఒకరినొకరు కలుసుకోకుండా అంతా వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నామని శృతిహాసన్ స్పష్టం చేసింది.

"మేమంతా విదేశాల నుంచి తిరిగొచ్చాం. ప్రస్తుతం వేర్వేరు ఇళ్లలో ఉంటున్నాం. అమ్మ ముంబయిలోనే వేరే అపార్ట్ మెంట్ లో ఉంటోంది. నేను ఇంకో ఇంట్లో ఉంటున్నాను. నాన్న, చెల్లెలు చెన్నైలోని వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. నిజానికి మేమేంతా కలిసి వెళ్లలేదు. వేర్వేరు పనుల మీద వేర్వేరు దేశాలకు వెళ్లాం. అందుకే ఇప్పుడిలా విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నాం. విదేశాల నుంచి వస్తున్న వాళ్లంతా ఇలానే ఉండాలని ఆశిస్తున్నాను."

ప్రస్తుతం తనకు ఇంట్లో మరో వ్యక్తి లేరని, పనిమనిషిని కూడా వద్దని చెప్పేశానని అంటోంది శృతిహాసన్. తను, తనతో పాటు క్లారా (పెంపుడు పిల్లి) మాత్రమే ఉందని స్పష్టంచేసింది. షూటింగ్స్ కూడా కాన్సిల్ అవ్వడం వల్ల తనపై ఒత్తిడి తగ్గిందంటోంది ఈ బ్యూటీ.

రోజా దంపతుల రుద్రాభిషేకం

సోషల్ మీడియా లోకి మెగాస్టార్

Show comments