శర్వా.. ఆ డైరక్టర్ కు లిఫ్ట్ ఇస్తాడా?

చాలా ప్రశాంతంగా, తాపీగా సినిమాలు చేసే హీరో ఎవరు టాలీవుడ్ లో అంటే శర్వానంద్ నే. షూటింగ్ గు వెళ్లడం అంటే చిన్నపిల్లాడిని స్కూలుకు వెళ్లమన్నట్లే. స్లోగా, జాగ్రత్తగా, హడావుడి లేకుండా, గ్యాప్ లు ఇచ్చుకుంటూ షూటింగ్ లు చేస్తాడు. అందుకే అతగాడి సినిమాలు అన్నేసి రోజులు సెట్ ల మీద వుంటాయి.

శర్వానంద్ ప్రస్తుతం పడి పడి లేచె మనసు సినిమాను ఫినిష్ చేసారు. సుధీర్ వర్మ డైరక్షన్ లో చేస్తున్న మాఫియా లీడర్ బయోపిక్ లాంటి 'దళపతి' సినిమా సగానికి కాస్త అటుగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా నలభై శాతం షూట్ వుంది.

అయితే ఇటీవల సవ్వసాచి సినిమాతో ఫెయిల్యూర్ ను తొలిసారి చవి చూసిన చందు మొండేటి ఓ లైన్ ను శర్వానంద్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దానికి శర్వా ఓకె అన్నట్లు వినికిడి. మరి ఆ లైన్ ను పూర్తి స్క్రిప్ట్ గా మారిస్తే, శర్వా డేట్ లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది.

చందు మొండేటి దగ్గర చాలా అడ్వాన్స్ లు వున్నాయి. పైగా శర్వానంద్ ఓకె అంటే  నిర్మాతలకు కరువేం లేదు. అందువల్ల శర్వానంద్ కనుక చందు మొండేటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, దళపతి తరువాత సినిమా అదే అవుతుందేమో?

ఆ సంగతి అలా వుంచితే, ఇంతకీ చందు చెప్పిన లైన్ ఏమయి వుంటుందో? గతంలో ఎప్పుడో, నాగచైతన్యకు కలలు, నిజాలు కావడం వంటి వాటిపై ఓ స్క్రిప్ట్ చెప్పాడు చందు మొండేటి. మరి అదే ఇప్పుడు ఇటు మారుస్తున్నారా? ఏమో?

రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్

Show comments