రాజమౌళిని వదలట్లేదుగా

పాపం ప్రపంచం అంతా పేరు సాధించిన దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ లో మాత్రం ఫాలోవర్ల నమ్మకాన్ని సంఫాదించలేకపోతున్నారు. పైగా విమర్శలు ఎదురవుతున్నాయి. ఆయన ఏదయినా బాగుందని ట్వీట్ చేస్తే చాలు, నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పైగా మరింత ముందుకు వెళ్లి ఆయనకు కులపిచ్చను అంటగడుతున్నారు.

ఇదంతా స్నేహం, అభిమానం ప్రాతిపదికగా ఆయన కొన్ని ట్వీట్లు చేయాల్సి రావడం తప్ప వేరు కాదు. పటేల్ సర్, పైసా వసూల్ వంటి సినిమాలకు రాజమౌళి చేసిన ట్వీట్లు వికటించాయి. అదే సమయంలో అర్జున్ రెడ్డి, ఫిదా వంటి సినిమాలకు ట్వీట్ లు చేయకపోవడం మరింత కారణమయింది.

ఇప్పుడు ఎన్టీఆర్ జై లవకుశ పై ట్వీట్ చేస్తే, జనాలు 'మీ ట్వీట్లను నమ్మమంటూ' సమాధానాలు ఇస్తున్నారు. ట్విట్టర్ లో ఎందుకనో రాజమౌళి తరపున నిల్చునే వారు తక్కువగా కనిపిస్తున్నారు. ఆయనకు లక్షలాది మంది ఫాలోవర్లు వున్నారు మళ్లీ. వారిలో ఎక్కువ మంది ఆయనను విమర్శిస్తున్నారు. అప్పటికీ ఈ మధ్య ఆయన పవన్ సినిమా మ్యూజిక్ బిట్ మీద కూడా ట్వీట్ చేసారు. తన కొడుకు సారధ్యంలో నిర్మాణమైన యుద్ధం శరణం సినిమాకు ట్వీటు కూడా వేయడం మానేసారు. 

అయినా ఇప్పుడు జై లవకుశకు ట్వీట్ చేసే సరికి మళ్లీ విమర్శలు స్టార్ట్ అయ్యాయి.

Show comments