మహేష్‌ 25 కోసం పూజ ఫిక్స్‌!

స్పైడర్‌ రిలీజ్‌ కాకముందే తదుపరి చిత్రం సెట్స్‌ మీదకి వెళ్లిపోవడంతో మహేష్‌ మలి చిత్రం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పని లేదు.

మహేష్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందుతోన్న 'భరత్‌ అనే నేను' వచ్చే సంక్రాంతికి రిలీజ్‌ అయిపోతుందని అంటున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటి కియారా అద్వానీతో మహేష్‌ రొమాన్స్‌ చేయబోతున్నాడు.

దీని తర్వాత మహేష్‌ చేసే ఇరవై అయిదవ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడు. మహేష్‌ ఎప్పుడో ఓకే చేసిన ఈ ప్రాజెక్ట్‌కి వంశీ ఇప్పటికే స్క్రిప్ట్‌ రెడీ చేసేసాడట. కొరటాల శివ చిత్రం పూర్తి కాగానే ఇది మొదలు కానుంది.

అందుకే మహేష్‌ ఫ్రీ అయ్యేలోగా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ మొత్తం పూర్తి చేసేస్తున్నారు. మహేష్‌ ల్యాండ్‌మార్క్‌ చిత్రాన్ని దిల్‌ రాజు, అశ్వనీదత్‌ సంయుక్తంగా నిర్మించనున్నారు.

ఈ చిత్రంలో కథానాయికగా పూజ హెగ్డే ఖరారైందని వార్తలొస్తున్నాయి. దిల్‌ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాథమ్‌లో పూజ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆమెకి మరో చిత్రం కోసం దిల్‌ రాజు అడ్వాన్స్‌ ఇచ్చాడని, అది మహేష్‌తో వంశీ పైడిపల్లి తీసే సినిమానే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే డిమాండ్‌ బాగా వున్న పూజ నిజంగా ఈ చిత్రంలో ల్యాండ్‌ అయితే టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ అయిపోవడం ఫిక్స్‌ చేసేసుకోవచ్చు. 

Show comments