దిల్ రాజు కు 'వకీలు' కావాలి

టాలీవుడ్ లో కొన్ని కట్టుబాట్లు వుంటాయి. ఇక్కడ అగ్రిమెంట్ ల కన్నా, నోటు మాటల కన్నా, నోటి మాటలకు, డిస్కషన్లకు విలువ వుంటుంది. కానీ రోజులు మారుతున్నాయి. ఇక్కడ కూడా అగ్రిమెంట్లు, కోర్టు కేసులు పెరుగుతున్నాయి. లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు పై కూడా ఇలా ఓ కేసు పడుతున్నట్లు బోగట్టా. 

విషయం ఏమిటంటే వకీల్ సాబ్ సినిమా యుఎస్ హక్కులను దుబాయ్ కు చెందిన ఫార్స్ కంపెనీకి విక్రయించారు. అలా అమ్మినపుడు యాభై రోజుల లోపు ఓటిటి ప్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనని దిల్ రాజు అగ్రిమెంట్ రాసి ఇచ్చినట్లు తెలుస్తోంది.

కానీ ఇప్పుడు ఆ టైమ్ లోగానే వకీల్ సాబ్ ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. దీంతో దుబాయ్ సంస్థ కేసు పెడతానని చెప్పినట్లు తెలుస్తోంది. తమకు మూడు కోట్ల పరిహారం ఇవ్వాలని లేదంటే కేసు పెడతామని ఫార్స్ సంస్థ నిర్మాత దిల్ రాజును హెచ్చరిస్తున్నట్లు తెలస్తోంది. దీని మీద డిస్కషన్లు సాగుతున్నాయి. 

ఇండస్ట్రీలో భాగంగా వున్నారు కనుక, సినిమా నిర్మాణంలోకి రావాలనుకుంటున్నారు కనుక, ఇలా ప్రతి దానికీ కేసులు, నోటీసులు అనే పద్దతి మంచిది కాదని టాలీవుడ్ జనాలు దుబాయ్ పార్టీకి హితవు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Show comments