తల్లితో ఎఫైర్.. కూతురిపై రేప్

హైదరాబాద్ లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓవైపు కరోనాతో అంతా బెంబేలెత్తిపోతుంటే, మరోవైపు ఓ కామాంధుడు ఏకంగా ఓ మైనర్ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వనస్థలిపురం పరిథిలో చోటుచేసుకుంది ఈ ఘటన.

వనస్థలిపురంలో ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలతో కలిసి భర్తకు దూరంగా ఉంటోంది. కుటుంబ కలహాల వల్ల భార్యాభర్తలు ఐదేళ్ల కిందట విడిపోయారు. ఓ ఏడాదిగా ఇబ్రహీంపట్నంకు చెందిన నరసింహయాదవ్ అనే వ్యక్తి ఈ కుటుంబానికి దగ్గరయ్యాడు.

ఈ క్రమంలో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నరసింహయాదవ్. వారంలో కనీసం 3 సార్లు మహిళ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు.

అయితే కొన్ని రోజులుగా తన మైనర్ కుమార్తె బలహీనంగా, నీరసంగా ఉండడం గమనించింది మహిళ. ఏం జరిగిందని కూతుర్ని ప్రశ్నించగా.. తనపై జరిగిన అకృత్యాన్ని కూతురు బయటపెట్టింది. బయటకు చెబితే చంపేస్తానని నరసింహ తనను బెదిరించాడని చెప్పింది.

దీంతో ఆశ్చర్యపోయిన మహిళ, నరసింహ యాదప్ పై పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న నరసింహ యాదవ్ కోసం వెదుకుతున్నారు.

ఇడ్లీపాత్ర లాగా ఉప్మాగిన్ని లాగా డిజైన్లు చేశారు

ఇంత సక్సెస్ అస్సలు ఊహించలేదు

Show comments