కోమటి రెడ్డి.. నాలుగు నెలల్లో మళ్లీ పోటీ!

తన సోదరుడు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడు అని ప్రకటించేశాడు కోమటిరెడ్డి  రాజగోపాల్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఆశ్చర్యకరమైన ఓటముల్లో ఒకటి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిది. ఈయన ఓడిపోతాడని ఎవ్వరూ అనుకుని ఉండరు. అలవోకగా గెలిచేస్తాడని అనుకుంటే, అనూహ్య ఓటమిని ఎదుర్కొన్నాడు వెంకట్ రెడ్డి, ఇలాంటి నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించాడు.

తను ఓడిపోయినంత మాత్రానా ప్రజలకు దూరం కాను అని, పదవి లేకపోయినా ప్రజలకు సేవ చేస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించుకున్నాడు. ఇక రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. తన సోదరుడు ఓటమితో నిస్పృహకు గురి కాలేదని చెప్పాడు.  ఆయన మళ్లీ పోటీ చేస్తాడని ప్రకటించాడు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ ఆగాల్సిన అవసరం లేదు అని, మరో నాలుగు నెలల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనే వెంకట్ రెడ్డి మళ్లీ బరిలోకి దిగుతారని రాజగోపాల్ రెడ్డి ప్రకటించాడు. అధిష్టానంతో చర్చించి తదుపరి వ్యూహాలను రెడీ చేస్తామని ప్రకటించాడీయన.

ఇది వరకూ రాజగోపాల్ రెడ్డి భువనగిరి నుంచి ఎంపీగా పోటీ చేసేవాడు. ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.  ఈ నేపథ్యంలో భువనగిరి నుంచి వెంకట్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తాడేమో!

Show comments