ఇది నిజం. బన్నీ-చరణ్ అటు ఇటు

ఖైదీ నెంబర్ వన్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. దాంతో సమస్యేమీ లేదు. కానీ ఆలస్యంగా బయటకు వినిపిస్తున్న గుసగుస ఒకటి వుంది. కొంతకాలంగా కేవలం బన్నీ ఎదుగుదల కారణంగా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య అంతరం పెరుగుతోందన్నది ఇండస్ట్రీ గుసగుస. అయితే ఖైదీ సినిమా విషయంలో చివరి నిమషంలో అరవింద్ రంగప్రవేశం చేసారు.

బన్నీని కూడా అడియో ఫంక్షన్ కు పిలిచారు. కానీ అల్లు శిరీష్ ను మాత్రం పిలవలేదని వినికిడి.అయినా మామయ్య మీద అభిమానం, మెగాస్టార్ట్ 150 వ సినిమా కావడంతో శిరీష్ వెళ్లినట్లు తెలుస్తోంది. అంతే కాదు, బన్నీ అడియో వేదికపై కావాలని చరణ్ ను పలకరించడానికి, దగ్గరగా వెళ్లడానికి తన వంతు సమస్య లేకుండా తెగ ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అలా చేసిన ప్రతి సారీ చరణ్ ఏదో బిజీ అన్నట్లు పక్కకు వెళ్లాడని అక్కడకు దగ్గరలో వుండి చూసిన వారు చెబుతున్న సంగతి.

బన్నీ కావాలని పదే పదే ఏదో విధంగా మాట కలుపుదామనుకున్నా కూడా చరణ్ పెద్దగా పట్టించుకోలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే బయటవారికి ముందు మేం 105 మంది అని పాండవులు అన్నట్లుగా, మెగా ఫ్యాన్స్ వారిలో వారు ఈ విషయాలు ముచ్చటించుకుంటున్నారు కానీ, బయట వారి ముందు పెదవి విప్పడం లేదు. ముందుముందు ఎలా వుంటుందో చూడాలి.

Show comments