గెలుపెవరిది?: స్ట్రాంగ్ రూమ్ లు తెరుచుకున్నాయి!

నెల రోజులుగా తీవ్రమైన ఉత్కంఠతను రేకెత్తించిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరి కాసేపట్లో తేలిపోనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ కేంద్రాల్లో స్ట్రాంగ్ రూమ్ లు తెరుచుకున్నాయి. ప్రజల తీర్పును నిక్షిప్తం చేసుకున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు మరి కాసేపట్లో అసలు గుట్టును బయటపెట్టనున్నాయి. ఐదు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.

ముందుగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ తో విజేతలు ఎవరు అనే విషయం తేలబోతోంది. కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లూ చేసింది. మధ్యాహ్నం పన్నెండు- ఒంటిగంటకు అంతా పూర్తి స్థాయిలో ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయి. 

విజయం పట్ల నేతల కాన్ఫిడెన్స్, గెలుపు ఎవరిదనే అంశం గురించి ఉన్న అంచనాల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ అంచనాలు, విశ్వాసాల గురించి ఇప్పుడు చర్చ అనవసరం. మరి కాసేపట్లో అసలు విషయం తెలిసిపోబోతోంది. తెలంగాణ విషయానికి వస్తే మొదటి అధికారిక ధ్రువీకరణ బెల్లంపల్లిలో జరగవచ్చని అంటున్నారు.

చివరి ఫలితంగా శేరిలింగంపల్లి విజేత ప్రకటన జరగవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు మొదలైంది. కూటమి గెలుస్తుందో.. కారు సత్తా చూపిస్తుందో మరి కాసేపట్లో పూర్తి స్పష్టత వస్తుంది.

Show comments