ఏమి ద‌రిద్ర‌మో....మ‌న పాదాలేంద్రా నాయ‌నా!

యువ‌గ‌ళం పేరుతో సుదీర్ఘ పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్టిన టీడీపీ యువ‌కిశోరం నారా లోకేశ్‌పై మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్ వ్యంగ్య కామెంట్స్ చేశారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ లోకేశ్‌ను ర్యాగింగ్ చేశారు. ఏమి ద‌రిద్ర‌మో కానీ, మ‌న పాదాలేంద్రా నాయ‌నా అంటూ లోకేశ్‌పై ఆయ‌న ఫ‌న్నీగా సెటైర్స్ విసిరారు. అబ్బ పాదం పెడితే మ‌నుషులు పోతున్నారు, న‌లుగురు ఆస్ప‌త్రి పాలైతిరి అని ఆట ప‌ట్టించారు.

కొడుకు పాదం పెట్టాడో లేదో ఒక‌డు ఆస్ప‌త్రిపాలైనాడని తార‌క‌ర‌త్న గుండెపోటుకు గురైన విష‌యాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. మీ తాత నంద‌మూరి నుంచి పార్టీ లాక్కుంటిరి అని ఎద్దేవా చేశారు. నంద‌మూరి కాస్త నారా అయ్యింద‌ని వెట‌క‌రించారు. నంద‌మూరికి నారా స్టాంప్ వేస్తిరి అన్నారు. నారా వెన‌కాల నంద‌మూరోళ్లు తోక‌లా తిరుగుతున్నార‌ని విమ‌ర్శించారు. ఈ రోజు పాద‌యాత్ర‌కి నంద‌మూరోళ్లు వ‌చ్చిన పాపానికి ఏకంగా పైకి పంపే ప్ర‌య‌త్నాలు చేస్తిరి అని నెల్లూరు యాస‌లో సెటైర్ విసిరారు.

ఏం పాదాల్రా నాయ‌నా అని వెట‌క‌రించారు. నారా వారిది మామూలు లెగ్ కాదు సామి అని వెట‌క‌రించారు. అప‌శ‌కునానికి చంద్ర‌బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ అనే అర్థం వ‌చ్చే రీతిలో అనిల్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. అలాంటి ఫేస్ అయిన చంద్ర‌బాబును ముందు పెట్టుకుని శుభ‌మా అని లోకేశ్ పాద‌యాత్ర‌కు బ‌య‌ల్దేరారని ఎగ‌తాళి చేశారు. భ‌లే శ‌కునాన్ని ముందు పెట్టుకుని పాద‌యాత్ర‌కు బ‌య‌ల్దేరావు లోకేశ్ అని అవ‌హేళ‌న చేశారు. ఇంకేంది లోకేశ్ నువ్వు గ‌ట్టెక్కేది? అని ప్ర‌శ్నించారు. నిన్న‌టి లోకేశ్ పాద‌యాత్ర‌ను చూశాన‌ని, ఎత్తిపోయింద‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు.

ఇలా సాగుతోంది లోకేశ్ పాద‌యాత్ర‌పై ప్ర‌త్య‌ర్థులు సెటైర్స్ విసురుతున్నారు. లోకేశ్ పాద‌యాత్ర‌ను కామెడీ షోగా చిత్రీక‌రించేందుకు ప్ర‌త్య‌ర్థులు అస్త్ర‌శ‌స్త్రాల‌ను సంధిస్తున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్టు ప‌రిస్థితులు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.

Show comments