ఈస్ట్ లో ఇక 'మెగా' సందడి

మెగా హీరోలు ఎవ్వరైనా ఈస్ట్ లో మాంచి క్రేజ్ వుంటుంది. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు ఈస్ట్ గోదావరిలో షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఫ్యాన్స్ వేలాదిగా రావడం, హీరో వాళ్లకు కనిపించాల్సిరావడం, ఇలా చాలా హడావుడి జరిగింది.

ఇటీవల పుష్ప సినిమా సంగతి చెప్పనక్కరలేదు. రంపచోడవరం, మారేడిమిల్లి ప్రాంతాల్లో బన్నీ ని చూసేందుకు ఫ్యాన్స్ వేలాదిగా ఎగబడ్డారు.

ఇప్పుడు సాక్షాత్తూ మెగాస్టార్ నే ఈస్ట్ గోదావరిలో కాలు పెడుతున్నారు. ఆచార్య సినిమా షూట్ కోసం ఆయన అక్కడికి వెళ్తున్నారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుంచి భారీగా కోరుకొండ వరకు ర్యాలీ తీసేందుకు ఫ్యాన్స్ స్వాగత సన్నాహాలు చేస్తున్నారు.

పుష్ప సినిమా కోసం వేసిన సెట్, ఆ పరిసర ప్రాంతాల్లో ఆచార్య సినిమా షూట్ జరగనుంది. ఈ సినిమాలో నక్సలైట్ గా కొన్ని సీన్లలో చిరంజీవి కనిపిస్తారు. అలాగే అడవుల్లో కొన్ని సీన్లు వున్నాయి.

మ‌హేష్ బాబుతో మాది విడ‌దీయ‌లేని అనుభంధం

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది

Show comments