జగన్ తోనే జన్మంతా

రాజకీయం ఎంతటి వారినైనా విడదీస్తుంది. ఇక పచ్చ రాజకీయం అయితే ఎవరినైనా పడగొట్టి విడగొట్టి తమాషా చూస్తుంది. అయితే అలాంటి చెడు గాలులేవీ ప్రసరించని గాఢమైన బంధం తమదని వైసీపీలో జగన్ కి అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి అంటున్నారు. జగన్ తోనే ఈ జన్మంతా. ఇందులో రెండో మాటే లేదు. ఆ డౌటే ఎవరికీ అవసరం లేదు. జగన్ తాను వేరు కావాలని ఆశపడేవారి జన్మంతా నిరాశ తప్పదని కూడా తేల్చేసారు.

తన మీద‌ లేనిపోనివి రాయించడం, జగన్ తో తనకు చెడిందని మీడియాలో తోచినట్లుగా  ప్రచారం చేసి త్రుప్తి పొందడమే వారికి ఇక మిగిలిందని కూడా విజయసాయిరెడ్డి అంటున్నారు. తనకు వైఎస్సార్ కుటుంబంతో ఉన్న బంధం ఎంతో విలువైనందని కూడా ఆయన అన్నారు.

అలాంటి ప్రచారం చేసేవారి ఉద్దేశ్యాలు అందరికీ తెలుసునని, వాటిని నమ్మన‌క్కరలేదని కూడా అయన క్యాడర్ కి చెప్పుకొచ్చారు. ఇక జగన్ విశాఖను పాలనారాజ‌ధాని చేస్తానని అన్నారని, ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటార‌ని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు.

విశాఖ రాజధాని అయితే మరో పాతిక శాతం జనాభా పెరుగుతుందని, అందువల్ల ఆ జనాభాకు సరిపడా నీరు, ఇతర అవసరాలు విశాఖలో పెంచేందుకు ఇప్పటినుంచే తగిన కార్యాచర‌ణతో ప్రణాళికలు సిధ్ధం చేస్తున్నామని కూడా విజయ‌సాయిరెడ్డి చెప్పారు. మొత్తానికి జగన్ని విజయసాయిరెడ్డిని విడదీద్దామని అనుకుంటే అది చెల్లదని, ఈ జన్మకు కుదిరే పని కాదని విజయసాయిరెడ్డి చెప్పేశాక కూడా ఇంకా ట్రై చేస్తుకుంటామంటే  అవి పచ్చ పూనకాలే అనుకోవాలేమో.

కేసీఆర్ ప్లాన్ బాలయ్యకు ముందే తెలుసా

Show comments