అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. ఆ దుస్తుల్లో ఆమె తళతళ మెరిసిపోయారు. బంగారు, ఆకుపచ్చ రంగు దుస్తులతో పాటు ఆభరణాలను ధరించి మేలి ముసుగులో సిగ్గులొలుకుతూ కనువిందు చేశారు. అయితే రియల్ లైఫ్లో పెళ్లి కూతురు కాలేదు.
ఓ ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన యాడ్ షూట్లో జాన్వీకపూర్ పెళ్లి కుమార్తెగా ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా తీర్చిదిద్దిన డ్రెస్ జాన్వీకపూర్ను సరికొత్తగా ఆవిష్కరించింది. తాజాగా ఆయన హెరిటేజ్ కలెక్షన్స్ పేరుతో రూపొందించిన కొత్త డ్రెస్లో జాన్వీ భారతీయ సంప్రదాయం ప్రతిబింబించేలా కనిపించారు. ఇన్స్టాగ్రామ్లో తన ఫొటోలను షేర్ చేయడంతో పాటు ఆసక్తికర కామెంట్ కూడా ఆమె జత చేశారు.
‘మీకు ఎవరికైనా సన్నాయి మేళం వినిపిస్తోందా? లేక నాకు ఒక్కదానికే అలా అనిపిస్తోందా?మనీష్ మల్హోత్రా సరికొత్త కలెక్షన్స్లో నేను కూడా ఒక భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాను’ అని జాన్వీ పేర్కొన్నారు. ఈ యాడ్ షూట్ని ఎంజాయ్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో డిజైనర్ మనీష్ తాను రూపొందించిన సరికొత్త దుస్తుల కలెక్షన్స్కి సంబంధించి ఓ ప్రత్యేక వీడియో ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఆ వీడియోలో జాన్వీ కపూర్ని చూసి అభిమానులు ఫిదా అయ్యారు. ‘జాన్వీ.. మీరు రాకుమారిలా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీన్ని బట్టి జాన్వీ ఎంత అందంగా కనిపిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు.