మైత్రీ + 14 రీల్స్ తో మహేష్-పరుశురామ్

మొత్తానికి పరుశురామ్ (బుజ్జి) కోరిక తీరబోతోంది. గీత గోవిందం సినిమా తరువాత మహేష్ తో సినిమా చేయాలన్నది ఆయన కోరిక. అందుకే అల్లు అరవింద్ కు ఇష్టం లేకపోయినా, గీతాను దాటి బయటకు వచ్చారు. ఎక్కే గుమ్మం..దిగే గుమ్మం అన్నట్లుగా చాలా మంది హీరోలను కలిసారు. మహేష్ అయితే కథ బాగా నచ్చింది కానీ చేయలేకపోతున్నందుకు బాధగా వుంది అనే టైపులో మెసేజ్ పెట్టి, తప్పుకున్నారని వార్తలు వచ్చాయి.

ఆఖరికి 14రీల్స్ ప్లస్ పతాకంపై చైతన్య హీరోగా నాగేశ్వరరావు సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు. కానీ ఇంతలో పంట పండింది. మహేష్ మనసు మారింది. కొత్త కాంబినేషన్ సెట్ అయింది. వంశీ పైడిపల్లికి ఓ వారం పది రోజులు టైమ్ ఇచ్చారు.  ఆయన సరైన లైన్ తో వస్తే సరేసరి, లేదంటే పరుశురామ్ సినిమా పట్టాలు ఎక్కేస్తుంది. 

14రీల్స్ ప్లస్ సంగతేమిటి?

పరుశురామ్ గతంలో మహేష్ కు కథ చెప్పినపుడు మైత్రీకి చేయడం కోసమే చెప్పారు. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో ఆయన అలా అలా తిరిగి చివరకు 14రీల్స్ ప్లస్ దగ్గర సినిమా ఓకె చేయించుకున్నారు. అది కూడా తొమ్మిది కోట్ల రెమ్యూనిరేషన్. చైతన్య హీరో. మరి ఇప్పుడు మహేష్ తో మైత్రీ సినిమా అంటే 14 రీల్స్ ప్లస్ ఏమంటుందో? లేదా మహేష్ కు అలవాటే కాబట్టి, 14రీల్స్ ప్లస్, మైత్రీ మూవీస్ ను కలపుతారేమో? కానీ ఇలా కలవడం మైత్రీకి అంతగా ఇష్టం లేదని తెలుస్తోంది. తామే ముందు అడ్వాన్స్ ఇచ్చాం కనుక తామే సినిమా చేస్తాం పరుశురామ్ తోొ అనేది వారి వాదనగా వున్నట్లు తెలుస్తోంది.

ఇంతకీ పాపం దిల్ రాజు ప్రాజెక్టు ఏమవుతుందో? మహర్షిలో డబ్బులు రాలేదు. సరిలేరు నీకెవ్వరులో వాటా లేదు. వంశీ పైడిపల్లితో సోలో సినిమా అనుకుంటే ఆగిపోయింది.

తెలంగాణలో చేసారు మేము చేసాం అంటావా

Show comments