ఉపరాష్ట్రపతి ఇంట్లో వేడుకలకు జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖ పర్యటనలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు రెండు పెళ్ళిళ్ళకు కూడా హాజరవుతున్నారు. 

అందులో ఒకటి వైసీపీ నేత, విజయనగరం జిల్లా డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు కుమార్తె వివాహం ఒకటి అయితే మరోటి భారత ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మనవరాలి పెళ్ళి.

విశాఖలో అంగరంగ వైభవంగా వెంకయ్యనాయుడు మనవరాలు నీహారిక వివాహ రిసెప్షన్ జరగనుంది. ఆ కార్యక్రమానికి జగన్ హాజరవుతున్నారు. ఇక జగన్ తో పాటు అనేక మంది రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలకు తరలివస్తున్నట్లుగా తెలుస్తోంది.

తెలంగాణా రాష్ట్ర గవర్నర్ తమిళ సై విశాఖలో రెండు రోజుల కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆమె సైతం వెంకయ్యనాయుడు ఇంట్లో జరిగే కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది. 

బీజేపీకి చెందిన ప్రముఖులతో పాటు ఇతర పార్టీల వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యే ఈ కార్యక్రమం విశాఖలో ఒక రాజకీయ సందడిగానే అంతా చూస్తున్నారు. మొత్తానికి జగన్ విశాఖ టూర్ లో ఇది ప్రత్యేకమనే అంటున్నారు. 

Show comments