ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమం

కరోనా నుంచి కోలుకున్నాడనుకున్న ఎస్పీ బాలసుబ్రమణ్యం తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఎంజీఎం హాస్పిటల్ వర్గాలు ప్రకటించాయి. గడిచిన 24 గంటలుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిందని తెలిపిన ఆస్పత్రి వర్గాలు, బాలు పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపింది.

కరోనాతో ఆగస్ట్ 5న ఎంజీఎం హాస్పిటల్ లో చేరారు బాలు. అప్పట్నుంచి ఆయనకు చికిత్స అందిస్తూనే ఉన్నారు. ఈమధ్యనే ఆయనకు టెస్టుల్లో కరోనా నెగెటివ్ కూడా వచ్చింది. అయితే కరోనా వల్ల ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరింది. అందుకే వైరస్ తగ్గినప్పటికీ వెంటిలేటర్ సహాయంతోనే ఆక్సిజన్ తీసుకుంటూ వస్తున్నారు. ఎక్మో సపోర్ట్ అందిస్తూ, ఫిజియోథెరపీ చేయిస్తూ వస్తున్నారు.

4 రోజుల నుంచి ఆయన నోటితో ఆహారం తీసుకోవడం స్టార్ట్ చేశారు. వైద్యుల సహాయంతో లేచి కూర్చుంటున్నారు కూడా. దీంతో ఆయన మరికొన్ని రోజుల్లో కోలుకొని జనరల్ వార్డు కు షిఫ్ట్ అవుతాయని అంతా ఎదురుచూశారు. అంతలోనే ఆయన ఆరోగ్యం క్షిణించినట్టు వైద్యులు ప్రకటించారు.

అందరూ కలిసి బైటకి పంపేశారు

Show comments