నెక్ట్స్ టైం రాంగ్ టర్న్ తీసుకోను

యూటర్న్ సినిమాతో కెరీర్ పరంగా నిజంగానే యూటర్న్ తీసుకుంది సమంత. అంతకుముందు రాజుగారి గది-2లో కీలక పాత్ర పోషించినప్పటికీ అందులో నాగ్ ఉన్నాడు. అయితే యూటర్న్ మాత్రం పూర్తిగా ఫిమేల్ ఓరియంటెడ్ కథతో తెరకెక్కింది. సమంత తీసుకున్న నిర్ణయంపై కొన్ని నెలలుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. 

స్టార్ స్టేటస్ ఉన్న టైమ్ లో కమర్షియల్ హీరోయిన్ గా కొనసాగకుండా ఈ ప్రయోగాలు ఎందుకని ఆమెకు చాలామంది సలహాలు ఇచ్చారు. మరోవైపు యూటర్న్ సినిమా కోసం ఆమె చెప్పిన డబ్బింగ్ పై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటిపై మరోసారి స్పష్టత ఇచ్చింది సమంత. ఇకపై తన కెరీర్ లో ఇక రాంగ్-టర్న్ ఉండదంటోంది.

"ప్రేక్షకులకు, మీడియాకు థ్యాంక్స్. ఇకపై కూడా మీరు గర్వించే సినిమాలే చేస్తాను. చాలా ట్వీట్స్ చూశాను. ఎంతోమంది మెచ్చుకున్నారు. మరికొంతమంది నా డబ్బింగ్ పై విమర్శలు చేశారు. అన్ని ట్వీట్స్, రివ్యూస్ చూసి ఫైనల్ గా ఒకటి నిర్ణయించుకున్నాను. ఇకపై నా లైఫ్ లో రాంగ్ టర్న్ తీసుకోను."

సమంత తాజా స్టేట్ మెంట్ తో ఇక ఆమె బడా హీరోల సరసన కమర్షియల్ సినిమా చేయదనే విషయం స్పష్టమైంది. యూటర్న్ సక్సెస్ మీట్ లో ఈ వ్యాఖ్యలు చేసిందామె. యూటర్న్ సినిమాలో మెసేజ్ ఉందనే విషయాన్ని ప్రమోషన్స్ లో చెప్పకపోయినా, తను చేసిన సినిమాలో ఓ సందేశం ఉంటుందని జనాలు ఆశించడం తనకు నచ్చిందంటోంది సమంత.

ఇకపై కూడా అందరూ మెచ్చే సినిమాలే చేస్తానని, ఎంత కష్టమైనా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటానని మరోసారి స్పష్టంచేసింది. ఈ సక్సెస్ మీట్ కు టీఆర్ఎస్ నేత, కేసీఆర్ తనయ కవిత ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. 

యూటర్న్ సక్సెస్ మీట్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

Show comments