మెగాస్టార్.. పవర్ స్టార్.. రాజమౌళి.. కేటీఆర్

నలుగురూ నలుగురే. ఎవరి క్రేజ్ వారిది. ఎవరి సెలబ్రిటీ హోదా వారిది. ఈ నలుగురు ఇప్పుడు ఒక వేదికపైకి రాబోతున్నారు. ఈనెల 18న హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో జరగబోయే సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ నలుగురు ప్రధాన ఆకర్షణ. ఇక మిగిలిన మెగా హీరోలు ఎలాగూ వుంటారు.

వాస్తవానికి ఈ ఫంక్షన్ ను కర్నూలులో చేయాలనుకున్నారు. కానీ సరైన రవాణా సదుపాయాలు లేవు. స్పెషల్ ఫ్లయిట్ వేసుకోవాలి. జనాలు భారీగా వస్తే, రకరకాల సమస్యలు. అందుకే వెన్యూను హైదరాబాద్ కు మార్చేసారు. ఎంతమంది వచ్చినా సరిపోయే లాల్ బహదూర్ స్టేడియంను వేదికగా తీసుకుంటున్నారు.

బాహుబలితో ఇండియాలోనే నెంబర్ వన్ డైరక్టర్ గా మారిన రాజమౌళి, తెలంగాణ రాజకీయ రంగంలో కీలకనేత, మంత్రి కేటీఆర్ ప్రత్యేక అతిధులుగా హాజరవుతున్నారు. ఇక మెగాస్టార్ సోదరుడు, జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ కూడా రాబోతున్నారు. ఇలాంటి కాంబినేషన్ వుంటే ఇక జనాలకు ఏం కొదవు. హడావుడికి ఏం తక్కువ. మెగాభిమానులకు పండగే పండగ.

జగన్... గారాబం చేయడం నేర్చుకోవాలి!

Show comments