బిక్కుబిక్కుమంటున్న కోవీషీల్డ్ గ్రహీతలు

భారత్ లో కొవాక్సిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి టీకాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం నేరుగా కొవాక్సిన్, కొవిషీల్డ్ సేకరించి ప్రజలకు ఉచితంగా వేసింది. అటు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా వీటిని నేరుగా ఉత్పత్తిదారుల నుంచి సేకరించి నామమాత్రపు ధరకు అందించాయి.

దేశంలో దాదాపు 85 శాతం మంది కొవాక్సిన్ లేదా కొవీషీల్డ్ మాత్రమే తీసుకున్నారు. వీటిలో ఇప్పుడు కోవీషీల్డ్ నుంచి భయంకరమైన వాస్తవం ఒకటి బయటపడింది.

తమ కంపెనీ తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సైడ్ ఎఫెక్టులు కలిగిస్తుందని ఆస్ట్రాజెనికా కంపెనీ తొలిసారి అంగీకరించింది. కొవీషీల్డ్ తీసుకున్నవాళ్లలో కొంతమందికి రక్తం గడ్డకడుతుందని, మరికొందరికి తెల్ల రక్తకణాలు (ప్లేట్ లెట్స్) సంస్థ గణనీయంగా తగ్గిపోతుందని తెలిపింది సదరు కంపెనీ.

దీంతో దేశవ్యాప్తంగా ఆ వ్యాక్సిన్ తీసుకున్నవాళ్ల వెన్నులో వణుకు మొదలైంది. అయితే ఈ సైడ్ ఎఫెక్టు చాలా అరుదుగా మాత్రమే జరుగుతుందని తెలిపిన కంపెనీ, లక్ష మందిలో ఎంతమందిపై ఈ దుష్ప్రభావం చూపుతందనే లెక్కల్ని మాత్రం వెల్లడించలేదు.

Readmore!

కొవీషీల్డ్ వ్యాక్సిన్ వల్ల తాము ఎక్కువ సైడ్ ఎఫెక్టుల బారిన పడ్డామంటూ బ్రిటన్ లో పలువురు కోర్టుకెక్కారు. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా ఆస్ట్రాజెనికా కంపెనీ ఈ భయంకరమైన వాస్తవాన్ని బయటపెట్టింది.

కొవీషీల్డ్ తీసుకోవడం వల్ల తాము తీవ్ర దుష్ప్రభావాలకు లోనైనట్టు బ్రిటన్ కు చెందిన 51 మంది కోర్టులో కేసులు వేశారు. వీళ్లలో మొదట కేసు వేసిన వ్యక్తి జెమీ స్కాట్. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తను శాశ్వత మెదడు వాపు వ్యాధికి గురైనట్టు అతడు పేర్కొన్నాడు.

దీనికి సంబంధించిన విచారణలో భాగంగా కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో, ఆస్ట్రాజెనికా సంస్థ పై విధంగా స్పందించింది. రేర్ కండిషన్స్ లో తమ వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డ కడుతుందని తెలిపింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఈ వ్యాక్సిన్ తయారుచేసింది ఆస్ట్రాజనికా.

ఈ వ్యాక్సిన్ కు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతినిచ్చింది. దీంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్  ఇండియా, ఆస్ట్రాజనికాతో కలిసి భారీమొత్తంలో భారత్ లో కొవీషీల్డ్ ను ఉత్పత్తి చేసింది. ఆ వెంటనే కోట్లాది మందికి ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వం అందించింది. 

Show comments