పవన్ సినిమా కాస్త వెనక్కి?

పవన్ ఫ్యాన్స్ కు ఇది కాస్త గుడ్ న్యూస్ నా? బ్యాడ్ న్యూస్ నా? అన్నది వాళ్లకే తెలియాలి. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించే తమిళ రీమేక్ సినిమా కాస్త వెనక్కు వెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. 

సముద్రఖని డైరక్షన్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా పవన్ స్పెషల్ రోల్ లో ఈ సినిమాను ప్లాన్ చేసారు. స్క్రిప్ట్ ను త్రివిక్రమ్ అందిస్తుంటే, మాటలను బుర్రా సాయి మాధవ్ అందిస్తున్నారు. 

ఈ సినిమా మే నుంచి సెట్ మీదకు వెళ్తుందని టాక్ వుంది. సముద్రఖని కూడా నటుడిగా తన కమిట్ మెంట్ లు అన్నీ ఏప్రిల్ ఎండ్ లోగా ఫినిష్ చేసే పనిలో పడ్డారు. రవి కే చంద్రన్ ను సినిమాటోగ్రాపర్ గా తీసుకున్నారు. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఈ సినిమా కాస్త ఆలస్యం అయ్యేలా వుందని తెలుస్తోంది.

హరిహర వీరమల్లు సినిమాను వీలయినంత త్వరగా ఫినిష్ చేసే ఆలోచనలో పవన్ వున్నారు. ఏప్రిల్ నెల అంతా ఆ సినిమాకే కేటాయించారు. అయితే మరోపక్క పొలిటికల్ యాక్టివిటీ పెరుగుతోంది. పార్టీని పటిష్టం చేయడం, తరచు సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు పెరుగుతున్నాయి. 

పైగా సాయిధరమ్ తేజ్ ఇటీవలే బయటకు వచ్చారు. ప్రమాదానికి గురయిన తరువాత ఆయన షూటింగ్ చేయడం ఇప్పుడే ప్రారంభించారు. ఆయనను హడావుడి పెట్టి, అలసటకు గురిచేయకూడదని పవన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అందువల్ల కూడా సముద్రఖనితో చేయాల్సిన ప్రాజెక్టు కొంచెం ఆలస్యం అవుతుందని వినిపిస్తోంది. 

Show comments