జగన్ ను అబినందించిన ఆర్.నారాయణమూర్తి

ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ముఖ్యమంత్రి జగన్ ను అబినందించారు. మార్కెట్ లో ప్రజాస్వామ్యం అన్న సినిమా విజయయాత్ర సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఫిరాయింపుదారులను కచ్చితంగా రాజీనామా చేసి రావాలని వైఎస్‌ జగన్‌ చెప్పడం చాలా గొప్ప విషయమని, ఆయనను అభినందిస్తున్నాని ఆయన అన్నారు.

భారత్‌లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని అన్నారు. నేడు ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరును విమర్శించారు.

నేతలు ఓట్లను ఏవిధంగా కొంటున్నారు.. ఎన్నికలు అయ్యాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును ఈ సినిమాలో చూపించానని ఆయన వివరించారు.