జగన్ దగ్గరకు బన్నీ, మహేష్?

టాలీవుడ్ సమస్యలపై ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలిసేందుకు హీరోలు ఆసక్తిగా వున్నారా? ఈ మేరకు 'అవును' అనే సమాధానం వినిపిస్తోంది టాలీవుడ్ ఇన్నర్ సర్కిళ్లలో. 

టాలీవుడ్ సమస్యలు, ముఖ్యంగా ఆంధ్రలో టికెట్ సమస్యలు, అదనపు ఆటలకు అనుమతి వంటి విషయాలపై ముఖ్యమంత్రి జగన్ ను టాలీవుడ్ జనాలు కలిసి విన్నవించుకోవాల్సి వుంది. 

ఇదిలా వుంటే సిఎమ్ జగన్ ను టాలీవుడ్ పట్టించుకోవడం లేదు అనే అపవాదు ఒకటి వుండనే వుంది. పైగా ఇప్పుడు జగన్ మనసు మార్చాల్సిన అవసరం ఎంతయినా వుంది. 

గతంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో ఓ డెలిగేషన్ వెళ్లి వచ్చింది. కానీ పని అయితే జరగలేదు. కానీ ఈసారి పని చాలా కీలకం. రేట్లు రావడం, షో లు రావడం అన్నది అనివార్యం లేదూ అంటే నష్టపోయేది పెద్ద హీరోలే. 

అందుకే అవసరం అయితే జగన్ దగ్గరకు వెళ్లడానికి పెద్ద హీరోలు కూడా సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు బన్నీ, మహేష్ బాబు ఇద్దరూ తమ సానుకూలతను ఇప్పటికే వ్యక్తం చేసారని తెలుస్తోంది. అయితే అసలు ఎంత మందికి అపాయింట్ మెంట్ క‌మిట్ అవుతుందన్నది ఇంకా తెలియదు. 

కేవలం నలుగురినే రమ్మన్నారని వార్తలు వినవస్తున్నాయి. ఇంకో పక్క కౌన్సిల్ కు కూడా ఆంధ్ర పిన్సిపల్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చిందని, కొన్ని పేర్లు అడిగారని అంటున్నారు.

చిరు తో పాటు డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ సర్కిళ్ల నుంచి ఒక్కోక్కరిని అయినా తీసుకెళ్లాల్సి వుంటుంది. అందువల్ల హీరోలకు అవకాశం వుంటుందా? అన్నది చూడాల్సి వుంది. 

Show comments