ఫోన్ సంభాషణ నిండు ప్రాణం తీసింది

భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త. నిత్యం ఫోన్ లో మాట్లాడుకుంటే ఇంకేదో అనుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమై భార్య ప్రాణాలు తీసింది. హైదరాబాద్ శివార్లలో జరిగింది ఈ ఘటన.

పటాన్ చెరు మండలం రుద్రారం గ్రామానికి చెందిన స్వప్న, అదే ఊరికి చెందిన సురేష్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య స్వప్నపై కొన్నాళ్లుగా అనుమానం పెంచుకున్నాడు సురేష్. తను మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనేది అతడి అనుమానం.

ఈ క్రమంలో రాత్రి సురేష్ ఇంటికొచ్చే సమయానికి స్వప్న ఫోన్ లో మాట్లాడుతోంది. దీంతో సురేష్ అనుమానం మరింత ముదిరింది. ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నావంటూ దాడికి దిగాడు. క్షణికావేశంలో దారుణంగా కొట్టాడు.

సురేష్ దెబ్బలకు అపస్మారక స్థితికి చేరుకుంది స్వప్న. వెంటనే ఆమెను పటాన్ చెరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. స్పప్న సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సురేష్ పై కేసు నమోదు చేశారు. 

Show comments