మరిన్ని 'సైరా'లు రావాలి.. వైఎస్ జగన్ ఆకాంక్ష!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు చిరంజీవి దంపతులు. ఏపీ క్యాపిటల్ ప్రాంతంలోని సీఎం నివాసానికి చిరంజీవి, ఆయన భార్య సురేఖలు వెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన భార్య వైఎస్ భారతిలు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శాలువాతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సత్కరించి, ఆయనకు బొకే ఇచ్చారు చిరంజీవి.

ఈ మీటింగ్ గురించి వారం నుంచి ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. 'సైరా నరసింహారెడ్డి' విజయోత్సాహంలో ఏపీ సీఎంను కలిశారు చిరంజీవి. ఈ మీటింగ్ గురించి ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

'సైరా'ను కలిసినట్టుగా జగన్ మోహన్ రెడ్డి ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. 'చిరంజీవి గారు మనకు మరిన్ని స్మైల్స్ ను మరిన్ని మెమొరీస్ ను ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను..' అని జగన్ అధికారిక ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేశారు. జగన్ మోహన్ రెడ్డి నివాసంలోనే చిరంజీవి దంపతులకు విందు ఏర్పాట్లు జరిగినట్టుగా సమాచారం.

Show comments