బాబు ఏమిచ్చారు బాబూ...

పబ్లిక్ లో నిల్చుంటే ఏమైనా అంటాం అన్నారు శ్రీశ్రీ. అందుకే కావచ్చు మన పచ్చ పరమ భక్తులు పవన్ ను, జగన్ ను ఏ విధంగానైనా టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు లేటెస్ట్ గా పవన్, జగన్ కేరళకు ఏం ప్రకటించారు అని నిలదీస్తున్నారు. ప్రభుత్వం సాయం చేసింది, నటులు సాయం ప్రకటించారు. మరి పవన్, జగన్ మాట్లాడరేం అంటున్నారు.

కానీ ఇదే జనాలు మరి బాబుగారి సంగతి ఎందుకు మరిచిపోయారో? బాబుగారు ఇచ్చిన పదికోట్లు ఆయన పాకెట్ లోకి కావు. ప్రభుత్వ ఖజానాలోవి. హెరిటేజ్ అధినేతలుగా ఆయన, భార్య, కొడుకు ఎంతయినా ఇవ్వవచ్చు. ఇక కోడలు కూడా మామగారి కన్నా ఎక్కువ ఆస్తి పరురాలే మరి వారు ఏమీ ప్రకటించలేదు కదా?

అడిగితే అందరినీ అడగాలి. అంతేకానీ, మన బాబుగారిని వదిలేసి, జగన్ ను, పవన్ ను మాత్రం టార్గెట్ చేయడం అంటే పచ్చాభిమానం అనే అనుకుంటారు. నిజానికి చంద్రబాబు ఇవ్వాలనుకుంటే హెరిటేజ్ ద్వారా ఎంతయినా చేయచ్చు. పాలు, మజ్జిగ, పెరుగు ఇలా. కానీ ఈ ‘దేశా’భిమానులు ఆ మాట ఊసెత్తరు. జగన్ ఏమిచ్చాడు.. పవన్ ఏమిచ్చాడు అని మాత్రం అడుగుతారు.

దానం ఎప్పుడూ చేయమని డిమాండ్ చేయకూడదు. ఎవరి మనసుల్లో వారికి పుట్టాలి. కేసీఆర్ ప్రభుత్వానికి పాతికకోట్లు చేయాలని పుట్టింది. బాబుగారికి 10కోట్లే దయ కలిగింది. దానికేం అంటాం. ఎవరి ఇష్టం వారిది. అంతే కానీ నిలదీస్తే ఎలా?

Show comments