ఆదిపురుష్ కు శ్రీకారం

బాహుబలి ప్రభాస్ ఫుల్ స్పీడ్ లో వున్నారు. పాటలు, కొద్దిగా సీన్లు మినహా రాధేశ్వామ్ సినిమా ను పూర్తి చేసారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమాకు పూజ జరిగిపోయింది. ఆదిపురుష్ సినిమా మోషన్ కాప్చర్ ప్రారంభమైంది.

రామాయణం ఆధారంగా తయారయ్యే ఆదిపురుష్ లేటెస్ట్ టెక్నాలజీతో తయారయ్యే సినిమా. దీని కోసం భారీ సెట్లు, భారీ క్రూ వగైరా వ్యవహారాలు వుండవు.

మోషన్ కాప్చర్ విధానంలో నటీనటుల కదలికలు, హావభావాలు రికార్డుచేసి, వాటికి సాంకేతికత సాయంతో మిగిలిన హంగులతో జోడించడం జరుగుతుంది. దీనివల్ల చాలా సమయం ఆదా అవుతుంది. పైగా చూడడానికి ఆసక్తికరంగా వుంటుంది. 

హాలీవుడ్ సినిమాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఈ టెక్నాలజీని ఇండియన్ సినిమాలో పూర్తిగా వాడడం ఇదే తొలిసారి.

టి సిరీస్ పతాకంపై భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మించే ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు..సైఫ్ ఆలీఖాన్ ఈ సినిమా రావణుడిగా నటిస్తున్నాడు. బాహుబలి, సాహో తరువాత ప్రభాస్ నటించే పాన్ ఇండియా సినిమా ఇది.

ఎన్టీ రామారావు,జ‌గ‌న్ ల‌కు కొన్నిపోలిక‌లు

చంద్ర‌బాబు పై జేసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..! 

Show comments