10 సర్వేల్లో 9 జగన్ వైపే

ఆంధ్రప్రదేశ్‌లో 10 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో 9 సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేలడంతో కేంద్రంలో బిజెపి నేతలు చింతాగ్రస్తులైనట్లు కనపడుతోంది.

ఆత్మసాక్షి, మస్తాన్ వలీ నిర్వహించిన సర్వేలు మాత్రమే కాదు. లగడపాటి రాజగోపాల్ తమ్ముడు మధు నిర్వహించిన సర్వే కూడా జగన్ గెలుస్తారని తేలినట్లు సమాచారం.

ఢిల్లీలోనే మకాం వేసిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పడికీ  ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారట.

చంద్రబాబు గెలుస్తాడని లగడపాటి అనుకుంటే లేదు బ్రదర్ జగనే గెలుస్తాడు అని మధు పందె కాశాడట, 2019లో చంద్రబాబే గెలుస్తాడని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎవరితోనూ పందెం కాసే పరిస్థితిలో లేడట.

Readmore!

విచిత్రమేమంటే బిజెపి కూడా ఏపీలో ఐబీ ద్వారా సర్వే నిర్వహించిందని, అందులో కూడా ఎన్డీఏ కూటమి పరిస్ఖితి ఏంత బాగా లేదని తెలిసిందట. పురంధేశ్వరికూడా గట్టెక్కేఅవకాశాలు లేవని వారి సమాచారం.

Show comments