కాబోయే భర్తకు ఆ ఛాన్స్ లేదంటున్న హీరోయిన్

వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం పూర్తయిన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఈమె ఎంగేజ్ మెంట్ పూర్తయింది. ఇదే ఏడాదిలో పెళ్లి కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది వరలక్ష్మి. ఈ సందర్భంగా తన భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సినిమాలకు సంబంధించి నికొలాయ్, చాలా సెలక్టివ్ గా ఉంటాడట. మరీ ముఖ్యంగా తన సినిమాల విషయంలో బాగుంటే బాగుందని, నచ్చకపోతే బాగాలేదని ఓపెన్ గా చెబుతాడంట. అయితే నికొలాయ్ కు ఇప్పుడు ఆ చాన్స్ లేదని, సినిమా ఎలా ఉన్నా, బాగుందని చెప్పక తప్పదని జోక్ చేసింది వరలక్ష్మి.

కాబోయే భార్యను కాబట్టి, తను ఏ సినిమా చేసినా బాగుందని చెప్పక తప్పని పరిస్థితిలో నికొలాయ్ ఉన్నాడంటూ నవ్వేసింది. శబరి సినిమా ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడిన వరలక్ష్మి, ఆ సినిమా కథాంశాన్ని బయటపెట్టింది.

"సినిమాలో నేను యాంగ్రీ యంగ్ లేడీని కాదు. ఓ సాధారణ అమ్మాయిని. భర్తతో సమస్యల కారణంగా, అతని నుంచి విడిపోయి, కుమార్తెను ఒంటరిగా పెంచుతుంది నా పాత్ర. ఆమెకు ఏమైందనేది కథ. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం లభించింది. లౌడ్ మూమెంట్స్ ఉండవు. కుమార్తెను కాపాడుకునేటప్పుడు తల్లికి వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. డిఫరెంట్ యాంగర్ చూపించే అవకాశం వచ్చింది. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ మూవీలో హైలైట్ అవుతుంది. కూతుర్ని కాపాడుకోవడం కోసం తల్లి ఏం చేసిందనేది కథ."

ఇలా శబరి కథను బయటపెట్టింది వరలక్ష్మి. మే 3న థియేటర్లలోకి రాబోతున్న ఆ సినిమా ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్ అందిస్తుందని చెబుతోంది.