పోలవరం.. ఏం జరిగింది? ఏం జరుగుతోంది?

పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడిలాంటిది. అలాంటి ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో చందబాబు ప్రభుత్వం  పూర్తిగా విఫలమయ్యింది. ఐదేళ్ళకాలంలో పోలవరంలో చంద్రబాబు చేసినపని శూన్యం. చంద్రబాబు పోలవరాన్ని ఒక ఆదాయ వనరుగా వాడుకున్నారు తప్ప పూర్తిచేయానే సంకల్పంతో ఏరోజు పని చేయలేదని స్పష్టం అవుతోంది. ప్రాజెక్ట్ పనులను దక్కించుకున్న సంస్థలు కూడా పనులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో తాజాగా ఏపి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాత కాంట్రాక్ట్ను రద్దుచేసి మళ్లీ టెండర్లు (రివర్స్ టెండరింగ్) పిలవడంతో పోలవరం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం నిర్మాణ, మౌళిక వసతుల రంగాలు తిరోగమనంలో ఉన్నాయని అటువంటి పనులు చేపట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు లేకపోగా ప్రతీకూల పరిస్థితు ఎదురవుతున్నాయంటూ ఓ వైపు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది పోలవరం పరిస్థితి. 2004లోనే అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అన్ని అనుమతులు సాధించినా తర్వాత చంద్రబాబు ప్రభుత్వం దాన్ని కొనసాగించలేకపోయింది. 2018 డిసెంబర్ నాటికే పోలవరం ప్రాజెక్ట్ను పూర్తిచేసి గ్రావిటీ కెనాల్ ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామని సాక్షాత్తూ నాటి నీటిపారుదల శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దాన్ని చేతల్లో చూపించడంలో విఫలమయ్యారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపాదికన చేసిన కనీసం రెండేళ్ళ సమయం పడుతుంది పోలవరం పూర్తవ్వడానికి.

ఆది నుంచి వివాదాలతోనే...
ఈ నేపథ్యంలో పోలవరం పనులు సాగుతున్న తీరును పరిశీలిస్తే ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ నిర్ణయం సరైనదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలవరం ప్రాజెక్ట్ ఆది నుంచి వివాదాలతో నత్తనడక సాగుతుండగా అన్ని అనుమతులు లభించిన తరువాత కూడా చంద్రబాబు పాలనలో మరింతగా ప్రాజెక్ట్ పడకేసింది. ఇప్పుడున్న నిర్మాణ సంస్థలు అందుకు తగిన విధంగా వేగంగా పనులు చేపట్టే శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం మేలైన సంస్థలకు తక్కువ ధరకే పని అప్పగించేందుకు నిర్ణయించడం వల్లనే కాంట్రాక్ట్ను రద్దుచేసి రివర్స్ టెండరింగ్లో భాగంగా మళ్లీ నోటిఫికేషన్ జారీచేసింది. అంతా అనుకున్నట్లు సెప్టెంబర్ నెలాఖరు నాటికి పనిచేసే సంస్థలు ఖరారైతే నవంబర్ నెలాఖరు నుంచి మళ్లీ పనులు ప్రారంభించడం సాధ్యమవుతుంది. అప్పటికి గోదావరిలో వరద ప్రవాహం పరిమితంగా కూడా ఉండదు.

గత అయిదేళ్లలో ముందుకుసాగని పనులు..
కీలకమైన పనులేవి గత అయిదేళ్లలో ముందుకు సాగలేదు. 2014లో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు మొత్తాన్ని భరిస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్ట్ కు ఇప్పటివరకూ 16,673 కోట్లు ఖర్చు చేయగా అందులో జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించిన తరువాత 11,537 కోట్లు ఖర్చు చేశారు. వైయస్ రాజశేఖరరెడ్డి  పాలనలోనే 5,135 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. కేంద్రం నుంచి పిపిఏ ద్వారా 6,727 కోట్లు విడుదలయ్యాయి. ఇంకా 4,810 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. గత అయిదేళ్ళలో ఈ మొత్తం  ప్రాజెక్ట్ కు కేంద్ర ప్రభుత్వ నిధులే కీలకమయినప్పటికీ ప్రాజెక్ట్ పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం అయ్యింది.

పోలవరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనవి జలాశయ నిర్మాణంతో పాటు జల విద్యుత్ కేంద్రం. దీనిని సాంకేతిక భాషలో ఎర్త్ కమ్ ర్యాక్ఫిల్ డ్యామ్ (ఈసిఆర్ఎఫ్) అని పిుస్తారు. 2009లో ఈ పనులకు టెండర్లు పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఆ ధరకు గిట్టుబాటు కావని ఎవరూ ముందుకు రాలేదు. 2012లో నాటి ప్రభుత్వం టెండర్లు పిలవగా ట్రాన్స్ ట్రాయ్ పాటు మరికొన్ని సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో తక్కువ ధరకు పనులు చేపట్టాయి. ఆ తరువాత ఆ సంస్థల దివాళా తీయడంతో అందులో కొంత పనిని తప్పించి వేరే సంస్థలకు గత ప్రభుత్వం అప్పగించింది. ఆ తరువాత మరో రెండు సంస్థలకు కూడా మరికొన్ని పనులను అప్పగించారు. కాంట్రాక్ట్ రద్దు అయ్యే నాటికి మొత్తం మూడు సంస్థలు పనులను చేస్తుండేవి.

నత్తనడకన పోలవరం పనులు...
ఇంకా పనుల్లో 4 కోట్ల ఘనపు మీటర్ల మట్టి పని పూర్తికావాల్సి ఉంది. అదే విధంగా కీలకమైన కాంక్రీట్ పని 20 లక్షల ఘనపు మీటర్ల మేర నిర్మించాలి. ఇక స్ట్రక్చర్ల విషయానికి వస్తే 381 పూర్తికాగా 140 నిర్మాణ దశలో ఉన్నాయి. మరో 208 ఇంతవరకు ప్రారంభించనే లేదు. ప్రధానంగా హెడ్ వర్క్స్ లో 4 ప్యాకేజీ పనులతో పాటు జల విద్యుత్ కేంద్ర నిర్మాణాలు నత్తనడకన నడుస్తున్నాయి. మట్టిపనుల్లో డయఫ్రం వాల్, జట్ గ్రౌటింగ్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలినవన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. ముఖ్యంగా స్పిల్వే, స్పిల్ ఛానెల్, అప్రోచ్ ఛానెల్, పైలేట్ ఛానెల్, ఎడమ గట్టు పనులు మందకొడిగా సాగుతున్నాయి. కాంక్రీట్ పనుల విషయానికి వస్తే స్పిల్వే, స్టిల్లింగ్ బేసిన్, స్టిల్ ఛానెల్ మొదలైన కీలకమయిన పనులు పూర్తికావాల్సి ఉంది.

అధిక చెల్లింపుపై నిగ్గుతేల్చిన నిపుణుల కమిటీ...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఈ  ప్రాజెక్ట్ కు సంబంధించిన పనులపై ఉన్నతస్థాయి నిపుణు కమిటీతో విచారణ చేయించారు. ఆ కమిటీ విచారణ జరిపి పను అంతంత మాత్రంగానే జరగ్గా అందులో 2364.8 కోట్ల రూపాయలు అదనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారని నిగ్గుతేల్చింది. ఏయే పద్దు కింద ఎంతెంత మొత్తం అదనంగా చెల్లించింది, కాంట్రాక్టర్ల పట్ల నాటి ప్రభుత్వం ఏ విధంగా ప్రేమ చూపించింది సోదాహరంగా వివరించింది. నాటి ప్రభుత్వం ఆ విధంగా అదనపు మొత్తాలు చెల్లించినప్పటికీ సకాలంలో పను పూర్తికాలేదు.

మొదలుకాని పనులకు అడ్వాన్స్ లు..
జల విద్యుత్ కేంద్ర నిర్మాణం పనిని చేపట్టడంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థలతో పాటు పని అప్పగించిన ఏపి జెన్కో, నీటిపారుదల శాఖ ప్రధాన జలాశయ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ అందరూ ఒక్కరే అయినప్పటికీ పనులు చేపట్టడంలో పూర్తిగా నిర్లక్షం వహించారు. అసలు పని చేపట్టేందుకు అవసరమైన స్థలం అప్పగించకపోయినప్పటికీ 787.20 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ను కాంట్రాక్టర్కు జెన్కో చెల్లించడం కమిటీని విస్తుపరిచింది. అయినప్పటికీ పని ఏమాత్రం ముందుకు సాగలేదు.

జల విద్యుత్ కేంద్రం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా 2017 జనవరి 9న టెండర్లు పిలవగా సంస్థలను ఖరారు చేసి ఒప్పందం కుదుర్చుకోవడానికి దాదాపు ఏడాది సమయం పట్టింది. 2017 డిసెంబర్ 20న ఒప్పందం కుదుర్చుకుని 322 కోట్లు అడ్వాన్స్ చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రాజెక్ట్లోని స్పిల్వే ఛానెల్తో పాటు ర్యాక్ఫిల్ డ్యామ్, కాఫర్ డ్యామ్, గేట్ల బిగింపు, జల విద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం విధిలేని పరిస్థితుల్లో రద్దుచేసింది. రెండేళ్లలో ప్రాజెక్ట్ను పూర్తి చేయాంటే అన్ని పనులను ఒకే ప్యాకేజీ క్రింద ఒకే కాంట్రాక్టర్కు అప్పగించాలనే కమిటీ సూచన మేరకు ప్రభుత్వం తాజాగా రివర్స్ టెండరింగ్ పద్ధతిలో టెంటర్లు పిలిచింది.

అనుమతులన్నీ వైయస్ పాలనలోనే..
అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ శంకుస్థాపన చేసినా పని ప్రారంభించలేదు. చంద్రబాబు (1995 నుంచి 2004వరకు) అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన రాగా నిధులు ఎక్కడివి, నీళ్లు ఎక్కడివి అంటూ ప్రశ్నించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే జలయజ్ఞం కింద పెద్దఎత్తున నాటి ఉమ్మడి రాష్ట్రంలో అన్ని పెండింగ్ ప్రాజెక్ట్ ఒక్కసారిగా చేపట్టి చరిత్ర సృష్టించారు. అందులో భాగంగా 2005లో పోలవరం పనులు ప్రారంభిస్తూ హెడ్వర్క్స్, కుడి, ఎడమ కాలువ పనులను ప్యాకేజ్ వారిగా అప్పగించారు. అదే సమయంలో ఆయన కీలకమైన అన్ని అనుమతులను సాధించారు.

మొత్తం 13 రకాల అనుమతులు అవసరం కాగా అందులో 10 అనుమతులు వైయస్ పాలనలోనే లభించాయి. కీలకమైన పర్యావరణ, అటవీ అనుమతులులు, స్థల, జాతీయ వన్యప్రాణి, గిరిజన మంత్రిత్వశాఖ నుంచి ఆర్ఆర్ఆర్ అనుమతులు, సుప్రీంకోర్ట్ నుంచి పాపికొండల అభయారణ్య స్థల మార్పిడి, కేంద్ర జలసంఘం నుంచి టీఏసి, ప్లానింగ్ కమీషన్ నుంచి పెట్టుబడి వ్యయం, అటవీ, పర్యావరణ శాఖ నుంచి తుది అనుమతులు మొదలైనవి 2005 నుంచి 2009 మధ్య కాలంలో లభించాయి.

చంద్రబాబు పాలనలో అంటే 2017, 2019ల్లో టీఏసి రేస్ టూ, సవరించిన అంచనాలు అనుమతులు మాత్రమే లభించాయి. దీనిని బట్టి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన కీలకమైన అనుమతులు సాధించడంలో చంద్రబాబు చేసిందేమీ లేదు. అంతా నాటి ముఖ్యమంత్రి (దివంగత) వైయస్ రాజశేఖరరెడ్డి కాలంలోనే సాధ్యమైందనే విషయంపై స్పష్టత వస్తుంది.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది

Show comments