ఫోర్బ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ!

ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అత్యంత సంపాదన పరులైన సెలబ్రిటీల జాబితాలోకి ఎంటరయ్యాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డితో సంచలనంగా నిలిచి, ఆపై గీత గోవిందంతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని.. నోటా, టాక్సీవాలా సినిమాలతో సాగుతున్న ఈ హీరో ఫోర్ట్స్ లిస్టులోకి తొలిసారి ఎంటరయ్యాడు.

ఎంటరవ్వవడంతోనే వందమందిలో డెబ్బై రోండోస్థానాన్ని సొంతం చేసుకున్నాడు విజయ్. పద్నాలుగు కోట్ల రూపాయల సంపాదనతో విజయ్ ఈ స్థానాన్ని సొంతం చేసుకోవడం విశేషం. కొంతమంది క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రిటీల కన్నా విజయ్ ఈ జాబితాలో ముందున్నాడు. 

విజయ్ తో పాటు ఈసారి నయనతార కూడా జాబితాలో స్థానం సంపాదించింది. నయనతార సోలోగా సినిమాలను లీడ్ చేసే స్థాయికి వచ్చింది. పదిహేను కోట్ల రూపాయల పై స్థాయి సంపాదనతో జాబితాలో స్థానం సంపాదించింది. అలాగే తాప్సీ కూడా ఈ జాబితాలో ఉంది.

సౌత్ కు సంబంధించి జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ముప్పైకోట్ల రూపాయల పైస్థాయి సంపాదనతో ఈ జాబితాలో నిలవడం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబులు కూడా పవన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

అది లోకేష్ కెరీర్ కు మరింత మైనస్ కాదా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments