కాంగ్రెస్ అందుకే ఓడింది.. వీహెచ్ తాత!

బ్లడ్ బాయిల్ అయిపోతోందట కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కు. తెలంగాణ రాష్ట్ర సమితి గెలవడంపై గరం అవుతున్నాడు వీహెచ్ తాత. కూటమి గెలిస్తే తనే ముఖ్యమంత్రిని అయిపోదామని వీహెచ్ అనుకున్నాడు. ఆ మేరకు ముందే కర్చిఫ్ వేసే ప్రయత్నం కూడా చేశాడు. సోనియాగాంధీ దత్త పుత్రుడు.. ఇప్పుడు తెరాస గెలిచే సరికి తట్టుకోలేకపోతున్నాడు.

అంతేకాదు… కేసీఆర్ విజయానికి కారణం ఏమిటో కూడా ఈ తాత తేల్చేశాడు. మహామహా మేధావులు కూడా అంత తేలికగా తేల్చలేని ఈ అంశం గురించి వీహెచ్ తాత ఒకే మాటలో తేల్చేశాడు. అదేమిటంటే.. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందట. అందుకే తెలంగాణ రాష్ట్ర సమితి గెలిచిందట.

 ఈ విషయం గురించి తను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని ఈ తాత చెప్పుకొచ్చాడు. ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయని ఈయన మొదటి నుంచి చెబుతున్నాడట. ఇప్పుడు అదే జరిగిందట. మొత్తానికి ఈ తాత చెప్పిన మాటలను పట్టించుకోకపోవడం వల్ల.. ఈయనే ముఖ్యమంత్రి కాలేకపోతున్నాడనమాట.

అయినా.. జస్ట్ చిల్ తాతా అని చెప్పాలి.  ఎందుకంటే.. రాజస్తాన్ లో కాంగ్రెస్ గెలిచింది. మధ్యప్రదేశ్ లో ముందంజలో ఉంది. చత్తీస్ గడ్ లోనూ రాణించింది. మరి అక్కడ జరగాలేదా ఈవీఎంల టాంపరింగ్? వీళ్లు ఓడిన చోట మాత్రమే ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగినట్టా? గెలిచినచోట మాత్రం ప్రజా తీర్పా? ఏంటి తాతా ఇదీ?!

Show comments