ఫస్ట్ ట్రెండ్స్ః టీఆర్ఎస్ దూకుడు!

పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యతను కనబరుస్తూ ఉంది. వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ లో తెరాస స్పష్టమైన ఆధిక్యతను సంపాదిస్తోంది. ఇప్పటి వరకూ ఉన్న సమాచారం వరకూ ప్రకారం పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ తెరాస ఆరుస్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి కేవలం ఒక్క స్థానంలో మాత్రమే కాస్త ఆధిక్యతను సంపాదించింది.

మక్తల్ పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు ఆసక్తిదాయకంగా ఉన్నాయి. మొత్తం పన్నెండు వందల చిల్లర ఓట్లు ఇక్కడ పోల్ కాగా.. వాటిల్లో దాదాపు నాలుగు  వందల ఓట్లను తెరాస సొంతం చేసుకుంది. తెలుగుదేశం అభ్యర్థికి మూడు వందల చిల్లర ఓట్లు వచ్చాయి.

విశేషం ఏమిటంటే.. తెలుగుదేశంతో సమానం బీజేపీ కూడా ఓట్లను పొందడం. దాదాపు టీడీపీ, బీజేపీలు ఓట్లను సమానంగా పొందాయి. స్వతంత్ర అభ్యర్థులు వంద చిల్లర ఓట్లను సొంతం చేసుకున్నారు. ఓవరాల్ గా తెరాసకు వంద ఓట్లకు పైగా మెజారిటీ లభించింది. 

ఇక కరీంనగర్ జిల్లా పరిధిలో తెరాస ఆధిక్యత కొనసాగుతూ ఉంది. జగిత్యాలలో సైతం తెరాస ఆధిక్యంలో ఉండటం విశేషం. హుజూరాబాద్, తుంగతుర్తి, సిరిసిల్లా, హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధిక్యతను కనబరుస్తూ ఉంది.

Show comments