అడ్డగోలుగా విభజించారు కాంగ్రెస్ నేతలు ఈ రాష్ట్రాన్ని. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ కలిసి, ఈ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసారు. ఇదీ దాదాపు ఆరేడు నెలల క్రితం వరకు చంద్రబాబు, ఆయన అను'కుల' మీడియా పదే పదే ప్రవచించిన మాటలు. సరే, ఆ సంగతి అలా వుంచితే, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ మేని ఫెస్టో వచ్చింది. అందులో రెండో పేజీలోనే...
''...ప్రజా ఉద్యమాలు, ప్రజల త్యాగాలతో పాటు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గమనంలోకి తీసుకుని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన కోరుతూ, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ ఇవ్వడం వల్లే... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది...''
ఇప్పుడేం అనాలి? ఏ రోటి దగ్గర ఆ పాట పాడే రకం చంద్రబాబు అనుకోవాలా?
తాను భాజపాతో పొత్తు పెట్టుకుంటే అది జాతీయ అవసరం.
జనసేన, వైకాపా కలిసి భాజపాతో పొత్తు పెట్టుకోకపోయినా, కలిసి పోయాయని తన అను'కుల' మీడియాతో ప్రచారం సాగిస్తాం.
ఆర్నెల్ల క్రితం వరకు తల్లి కాంగ్రెస్-పిల్ల కాంగ్రెస్. నిజానికి వాళ్ల మధ్య పొత్తులేదు.
ఇప్పుడు పొత్తు అధికారికంగా పెట్టుకున్నా, తెలుగుదేశం పిల్ల కాంగ్రెస్ కాదు.
ఆంధ్రలో రాష్ట్రానికి కాంగ్రెస్ అన్యాయం చేసింది. అడ్డగోలుగా విభజించింది.
తెలుంగాణలో విభజనకు తామే కారణం అంటూ మ్యానిఫెస్టో.
ఇదే ముక్క తన అను'కుల' మీడియా ద్వారా ఆంధ్రలో డప్పేసి చాటమనండి. చూదాం.
తను ఏం చేసినా, ఎలా చేసినా, తనకు భజన చేసే, తన అను'కుల' మీడియా వుందనే ధీమా బాబుది. ఆ దన్ను ధైర్యం వున్నంత కాలం ఆయన ఇలాగే చేస్తూ వుంటారు.
రెడ్డి గారికి తత్వం బోధపడిందా..? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్