గత ఎన్నికల్లో గుంతకల్ నుంచి విజయం సాధించిన జితేందర్ గౌడ్కు ఇప్పుడు జేసీ సోదరుల నుంచి టెన్షన్ కనిపిస్తోంది, జితేందర్ టికెట్కు జేసీ సోదరులు ఎర్త్ పెడుతున్నారు. జేసీలు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోయినా.. తమకు నచ్చిన అభ్యర్థిని ఇక్కడ నుంచి పోటీ చేయించుకునేందుకు వారు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. దీనికిగానూ మధుసూదన్ గుప్తాను రంగంలోకి దించారు జేసీ బ్రదర్స్.
అనంతపురం ఎంపీ సీటు పరిధిలో అంతటా తాము చెప్పినవారే అభ్యర్థులుగా ఉండాలనేది జేసీ సోదరుల కోరిక. ఈ నేపథ్యంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ రచ్చ రేపుతున్నారు. అందులో భాగంగా గుంతకల్ సీటుకు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాను రంగంలోకి దించారు.
మధుసూదన్ గుప్తా ఆ మధ్య జగన్ను కలిశాడు. పాదయాత్రలో ఉన్న జగన్తో సమావేశం అయ్యాడు. అయితే గుంతకల్ సీటుకు వైసీపీకి వెంకట్రామిరెడ్డి రూపంలో అభ్యర్థి ఉండటంతో గుప్తాకు అక్కడ ఎంకరేజ్మెంట్ లభించలేదు.
ఈయన ఇంకా టీడీపీలోకి కూడా చేరలేదు. కానీ.. టీడీపీ టికెట్ మాత్రం ఈయనకే అని ప్రచారం జరుగుతోంది. ఇది సిట్టింగ్ ఎమ్మెల్యేకు టెన్షన్గా మారింది. గత ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గాడు జితేందర్ గౌడ్. ఈసారి ఈయనకు అవకాశాలు లేవని అంటున్నారు.
బాబు కూడా ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కన పెట్టనున్నాడని సమాచారం. ఇక్కడ తాము కోరుకున్నట్టుగా జేసీ సోదరులు మధుసూదన్కు టికెట్ ఇప్పించుకుంటారని ప్రచారం జరుగుతోంది.
మీటూ... సంచలనంగా మొదలైందో.. అంతే చప్పున చల్లారిందా?.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్