సుకుమార్ 'చివరాఖరి' ప్రయత్నం

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేతిలోకి వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది డైరక్టర్ సుకుమార్ కు. సినిమా నిర్మాణాల వైపు ఎక్కువ దృష్టి పెట్టడం, మహేష్ కు చకచకా నెరేషన్ ఇవ్వడంలో ఆలస్యం చేయడం, అదే టైమ్ లో మరో ఆల్టర్ నేటివ్ గా అనిల్ రావిపూడి కనిపించడంతో సినిమా చేజారిపోయే పరిస్థితి వచ్చేసింది. తనకు తానుగా కాస్త సమయం కావాలని సుకుమార్ అడిగారని, మహేష్ అందుకు ఓకె అనేసి, అనిల్ సుంకర-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారని వార్తలు వచ్చాయి.

దీంతో సుకుమార్ ను నమ్ముకుని, ఆయనను విపరీతంగా పాంపర్ చేస్తున్న మైత్రీమూవీస్ జనాలు టెన్షన్ పడాల్సి వచ్చింది. దాంతో సుకుమార్ మరోసారి మహేష్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకసారి కలుస్తానని, ఓ లైన్ చెప్పాల్సి వుందని సుకుమార్ కబురు చేసినట్లు బోగట్టా. టాప్ డైరక్టర్ కాబట్టి, బాగుండదు కనుక మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాబోయే రెండు మూడురోజుల్లో సుకుమార్ కలిసి మహేష్ కు ఓ లైన్ చెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. అది ఓకె అయితే రెండునెలలు టైమ్ అడిగి, ఫినిష్ చేసే ప్రయత్నం చేస్తారని టాక్. అయితే మహేష్ ఇప్పటికే అనిల్ రావిపూడితో సినిమా అన్నది ఫిక్స్ అయిపోయారని, సుకుమార్ లైన్ చెపతా అంటే జస్ట్ వినడం కోసం తప్ప వేరుకాదని కూడా టాక్ వుంది. 

డైరక్టర్ తన రూట్ లో వెళ్లకుండా, నిర్మాణాలు, ప్రాజెక్టుల సెట్టింగ్ వంటి వాటిపై ఎక్కువ దృష్టిపెట్టడం వల్లే సుకుమార్ కు ఈ పరిస్థితి అని కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!

Show comments