మొదటి గర్ల్ ఫ్రెండ్ చెంతకు చేరిన సుధీర్ బాబు

సుధీర్ బాబుకు ఆల్రెడీ పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారనే విషయం తెలిసిందే. ఇలాంటి హీరో తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ చెంతకు చేరానంటూ ప్రకటిస్తే ఎలా ఉంటుంది? అదో పెద్ద వివాదం అవుతుంది. కానీ ఇక్కడ సుధీర్ బాబు ఎలాంటి వివాదాల జోలికి వెళ్లలేదు. కేవలం తన ఇష్టాన్ని ఇలా చాటుకున్నాడంతే.

సినిమాల్లోకి రాకముందు సుధీర్ బాబు బాడ్మింటన్ క్రీడాకారుడనే విషయం తెలిసిందే. సినిమాల్లో బిజీ అయిన తర్వాత బాడ్మింటన్ కు దూరమయ్యాడు ఈ హీరో. అలా దూరమైన ఇన్నేళ్లకు తిరిగి తనకెంతో ఇష్టమైన బాడ్మింటన్ కోర్టులోకి వచ్చాడు. అందుకే బాడ్మింటన్ ను తన తొలి గర్ల్ ఫ్రెండ్ గా చెప్పుకొచ్చాడు.

ఇప్పుడు కూడా సుధీర్ బాబు ఖాళీగా ఏం లేడు. సొంతంగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి మరీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కానీ ఇలా సడెన్ గా బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేయడానికి ఓ కారణం ఉంది. త్వరలోనే పుల్లెల గోపీచంద్ బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు ఈ హీరో. ఆ మూవీ కోసమే ఇలా మరోసారి కోర్టులోకి ఎంటరయ్యాడు.

పుల్లెల గోపీచంద్ బయోపిక్ కు సంబంధించి బౌండెట్ స్క్రిప్ట్ రెడీ అయింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది.

టీడీపీ ఎమ్మెల్యేకు జేసీ అనుచరుడితో టెన్షన్‌!.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments