అవార్డ్ విన్నింగ్ సినిమాకు సీక్వెల్

"అ!" సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. దీంతో ఇప్పుడా సినిమాను మరోసారి తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. అందుకే తన తొలి సినిమాకు సీక్వెల్ ఎనౌన్స్ చేశాడు. "అ!" సినిమా కమర్షియల్ గా హిట్ కాదు, విమర్శకుల ప్రశంసలు మాత్రం అందుకుంది. అయినప్పటికీ అవార్డు రావడంతో ప్రశాంత్ వర్మ ఇలా ఫిక్స్ అయ్యాడు.

"అ!" సినిమా క్లయిమాక్స్ లో కాజల్ చనిపోతుంది. అంతకంటే ముందు ఎన్నో కథల సమాహారంగా "అ!"ను చూపిస్తారు. ఆ స్క్రీన్ ప్లే క్రిటిక్స్ మెప్పుపొందింది. అయితే సీక్వెల్ లో మాత్రం ఇలా ఎన్నో కథలు కాకుండా, కేవలం ఒకే కథ ఉంటుందని స్పష్టంచేశాడు ప్రశాంత్ వర్మ. అయితే మొదటి సినిమాలోనే మెయిన్ క్యారెక్టర్ చనిపోవడంతో, సీక్వెల్ ను ఇతడు ఎలా కొనసాగిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం ఈ దర్శకుడి చేతిలో 2-3 కథలున్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా ఉంది. వాటిలో ఏది ముందుగా సెట్స్ పైకి వస్తుందనేది ఇంకా క్లారిటీలేదు. అంతలోనే "అ!" సినిమాకు సీక్వెల్ కూడా ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. మరోవైపు ఇతడు సగం డైరక్ట్ చేసిన దటీజ్ మహాలక్ష్మి సినిమా విడుదలకు సిద్ధమౌతోంది.

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

Show comments