'సరిలేరు' బయ్యర్లు ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్ లో అనిల్ సుంకర-దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరూ'. ఈసినిమా నిర్మాణ వ్యవహారాలు అనిల్ సుంకర చూసుకుంటున్నారు. మార్కెటింగ్ అంతా దిల్ రాజు చూసుకుంటున్నారు. సంక్రాంతికి విడుదలయ్యే ఈ సినిమా బయ్యర్లను ఇప్పుడే ఫిక్స్ చేసేసారు. దిల్ రాజు రెగ్యులర్ బయ్యర్లకే సరిలేరు నీకెవ్వరు సినిమా ఇవ్వడానికి డిసైడ్ చేసారు.

మహర్షి సినిమా కూడా ఈ బయ్యర్లే డిస్ట్రిబ్యూట్ చేసారు. ఇప్పుడు ఈ సినిమా కూడా వారికే ఇవ్వడానికి డిసైడ్ చేసి, అడ్వాన్స్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. నైజాం, వైజాగ్ ఎలాగూ దిల్ రాజే పంపిణీ చేస్తారు. మిగిలిన ఏరియాలకు బయ్యర్లను ఫిక్స్ చేసి, ఇటీవలే అడ్వాన్స్ లు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ రేట్లకు ఇస్తారు అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. అది విడుదలకు ముందు ఫిక్స్ చేస్తారు. 

ఈ సినిమాకు మహేష్ బాబు తన రెమ్యూనిరేషన్ కింద నాన్ థియేటర్ రైట్స్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. థియేటర్ రైట్స్ దగ్గర దగ్గర వంద కోట్ల వరకు వస్తాయని అంచనా. సినిమాకు 70 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వుంది. స్టార్ కాస్ట్, యాక్షన్ ఎపిసోడ్స్, వర్కింగ్ డేస్. ట్రెయిన్ సెట్, కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్ ఇలా అన్నీ కలిపి కాస్త గట్టిగానే ఖర్చవుతుందని తెలుస్తోంది.

బాహుబలి' ఇంకా కలగానే ఉంది