సందీప్ అవుట్.. శౌర్య ఇన్

సందీప్ కిషన్-సంతోష్ జాగర్లమూడి కాంబినేషన్ లో సినిమా ప్రకటించారు ఆ మధ్య. అయితే ఇప్పుడు ఆ సినిమా చేతులు మారిపోయినట్లు తెలుస్తోంది. కేవలం నిర్మాణమే కాదు, హీరో కూడా మారిపోయినట్లు బోగట్టా. సందీప్ కిషన్ ప్లేస్ లోకి హీరో నాగశౌర్య వచ్చి చేరాడు. ఈ సినిమాను ఆసియన్ సునీల్ నిర్మిస్తారు. ఆయన నిర్మాణ రంగంలోకి వచ్చిన తరువాత ఇది రెండో ప్రాజెక్టు. ఒక ప్రాజెక్టు శేఖర్ కమ్ములతో చేస్తున్నారు.

సందీప్ కిషన్ తో జాగర్లమూడి సంతోష్ చేయాలనుకున్న కథనే సునీల్ దగ్గరకు తీసుకెళ్లారా? లేదా హీరోను, కథను, ప్రొడక్షన్ కంపెనీనీ వదిలేసి, వేరే కథతో అక్కడ చేస్తున్నారా? అన్నది తెలియాల్సి వుంది. వాస్తవానికి సందీప్ కిషన్ తో చేయాలనుకున్న సినిమా విలువిద్య నేఫథ్యంలో వుంటుంది. ధనుర్ధారి అని టైటిల్ కూడా అనుకున్నారు.

శౌర్య ఇప్పుడు మాంచి ఫిజిక్ తో వున్నాడు కాబట్టి, ఈ సబ్జెక్ట్, టైటిల్ కు అతను సూట్ అవతాడని అనుకుని, ప్రాజెక్టు మొత్తం ఇలా మార్చేసినట్లు కూడా వినిపిస్తోంది. మొత్తంమీద ఆసియన్ సునీల్ రెండో ప్రాజెక్టుగా మంచి సబ్జెక్ట్ నే టేకప్ చేసినట్లు కనిపిస్తోంది.

ఇదిలా వుంటే సంతోష్ జాగర్లపూడి డైరక్షన్ లో శౌర్య సినిమా చేయడం అన్నది వాస్తవమే అని, కానీ సందీప్ కిషన్ కు చెప్పిన కథ కాదని, ఇది వేరే కథ అని రెండు వైపుల యూనిట్లు చెబుతున్నాయి. ఏ సినిమాకు ఆ సినిమా సెపరేట్ గా వుంటాయంటున్నారు. అయితే ఏది ముందు, ఏది వెనుక అన్నది క్లారిటీ లేదు. కానీ మరో పక్క గుసగుసలు మాత్రం ఇదే అని వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments