కామెడీ తీస్తే, అంతా ఏడుస్తూ బయటకొస్తున్నారు

తన అప్ కమింగ్ మూవీ "ఓ బేబీ"పై డిఫరెంట్ గా స్పందించింది సమంత. గ్రేట్ ఆంధ్రకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ బ్యూటీ, తాము కేవలం కామెడీ సినిమా చేశామని అనుకున్నామని, కానీ చాలామంది సినిమాలో ఎమోషన్ కు కనెక్ట్ అయ్యారని చెప్పుకొచ్చింది.

"ఓ బేబీ స్టార్టింగ్ ఫ్రేమ్ నుంచి ఓ స్మయిల్ ఉంటుంది. దాదాపు 90శాతం నేను నవ్వుతూ కనిపిస్తాను. ఫ్యామిలీ మొత్తానికి సెలబ్రేషన్ ఇది. వందశాతం వినోదం గ్యారెంటీ. మేం ఇలానే భావించాం. కానీ ఈ సినిమా చూసిన చాలామంది క్లయిమాక్స్ లో ఎమోషన్ కు కనెక్ట్ అయ్యారు. ఇప్పటివరకు దాదాపు 200 మంది చూస్తే అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు."

పరిశ్రమలో కొంతమంది వ్యక్తులు, తమ స్నేహితులకు ఓ బేబీ సినిమాను చూపించామని, వాళ్లంతా ఇందులో ఎమోషన్ కు బాగా కనెక్ట్ అయిపోయారని చెప్పుకొచ్చింది సమంత. అప్పటివరకు దీన్ని కామెడీ సినిమా చెప్పుకొచ్చిన తామంతా, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో మాట మార్చామని, కామెడీతో పాటు మంచి ఎమోషన్ కూడా ఉంటుందని చెప్పడం స్టార్ట్ చేశామని చెప్పుకొచ్చింది.

ఓ బేబీ సినిమాలో తను ఎంతో కష్టపడి నటించానంటున్న సమంత... రాజేంద్రప్రసాద్ సహకారం, మిక్కీ జే మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లేకపోతే సినిమా లేదంటోంది. వాళ్లిద్దరూ తమ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యారని చెప్పుకొచ్చింది. పాటలతో పాటు రీ-రికార్డింగ్ లో మిక్కీ జే మేయర్ మ్యాజిక్ చేశాడని అంటోంది.

మరోవైపు ఓ బేబీ సీక్వెల్ పై కూడా స్పందించింది సమంత. సినిమా చేసినప్పుడు చాలా కష్టపడ్డానని, మళ్లీ సీక్వెల్ లో నటించడం తన వల్ల కాదని చెప్పేసింది. తప్పనిసరిగా సీక్వెల్ చేయాలనుకుంటే వేరే వాళ్లను చూసుకోమని డైరక్టర్ నందినీరెడ్డికి ఓపెన్ గానే చెప్పేసింది సమంత.

తెలుగుదేశం కథ ముగిసిందా?.. బడాయికి పోతున్న బీజేపీ

Show comments