నాది దొంగపెళ్లి కాదు - రేణుదేశాయ్

తన పెళ్లిపై మరోసారి స్పందించింది పవన్ మాజీ భార్య రేణుదేశాయ్. తనకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందని త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటానని మరోసారి క్లారిటీ ఇచ్చింది. అయితే తనది దొంగ పెళ్లి మాత్రం కాదంటోంది. అందరికీ చెప్పి చేసుకుంటానంటోంది.

"నాకు ఎంగేజ్ మెంట్ అయిపోయింది. ప్రపంచమంతా తెలుసు. ఆమధ్య చాలా హడావుడి నడిచింది. ఎక్కువ వివరాలు ఇవ్వను కానీ అందరికీ చెప్పే పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే ఇది దొంగపెళ్లి కాదు. మా కుటుంబంలో అందరి ఆమోదంతో జరుగుతోంది."

తనకు నిశ్చితార్థం జరిగి చాన్నాళ్లయిందని, అయినప్పటికీ ఇంకా తను ట్రోలింగ్ కు గురవుతూనే ఉన్నానని చెప్పి బాధపడింది రేణుదేశాయ్. పైగా ఎంగేజ్ మెంట్ జరిగి ఇన్నాళ్లయినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదనే అంశంపై కూడా హడావుడి ఎక్కువైందని చెప్పుకొచ్చింది.

"నాకు ఎంగేజ్ మెంట్ అయిపోయింది. అయినప్పటికీ ఇంకా ట్రోలింగ్ నడుస్తోంది. ఎంగేజ్ మెంట్ అయి చాన్నాళ్లయింది ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదంటూ డిస్కషన్. నా పెళ్లి గురించి నాకు తప్ప అందరికీ హడావుడి ఎక్కువైపోయింది. త్వరలోనే చేసుకుంటా. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. అన్ని ఎరేంజ్ మెంట్స్ చేసుకోవాలి."

ఈసారి మాత్రం తన కాబోయే భర్త వివరాల్ని దాచలేదు రేణు. అతడు పూణెలోని ఓ ఐటీ కంపెనీలో డైరక్టర్ స్థాయిలో పనిచేస్తున్నాడట. మొన్నటివరకు అమెరికాలోనే ఉండేవాడట. తండ్రి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో పూణెకు షిఫ్ట్ అయ్యాడట. ఆయన పేరు మాత్రం చెప్పలేదు రేణుదేశాయ్.

భారీస్థాయిలో పోలింగ్ అధికార పార్టీలను గద్దెదించింది

Show comments